తెలంగాణ

23న పెన్షన్ అదాలత్: ట్రెజరీ శాఖ వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: ఈ నెల 23 న ‘పెన్షన్ అదాలత్’ నిర్వహిస్తున్నామని ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ శాఖ డైరెక్టర్ కెఎస్‌ఆర్‌సీ మూర్తి తెలిపారు. శనివారం ఆయన మీడియాకు ఒక ప్రకటన జారీ చేస్తూ 23 న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో పెన్షన్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన ప్రభుత్వ పెన్షనర్లు ఈ లోక్ అదాలత్‌లో పాల్గొనవచ్చన్నారు. పెన్షనర్లు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా ఉంటే ఈ సందర్భంగా ప్రస్తావించవచ్చన్నారు. అదనపు సమచారం కావలసిన వారు 040-2323 3956 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. సంబంధిత అధికారులంతా ఈ సమావేశంలో పాల్గొంటారని మూర్తి వివరించారు.