తెలంగాణ

గవర్నర్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమరయోధుల త్యాగం వల్లనే భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని గుర్తు చేశారు. త్యాగమూర్తులను స్మరించుకుంటూ, దేశాభివృద్ధికి బాటలు వేసుకుందామని పిలుపు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. గురువారం రాఖీపౌర్ణమి కావడంతో రాజ్‌భవన్‌లోని దర్భార్ హాలులో ఉదయం 11 నుండి 12 గంటల వరకు రక్షాబంధన్ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో గవర్నర్ నరసింహన్‌తో పాటు ఆయన భార్య విమలానరసింహన్ కూడా పాల్గొంటారు. పాఠశాలల విద్యార్థులను, పౌరులను గవర్నర్ దంపతులు కలుస్తారు.