తెలంగాణ

పునర్విభజన ముచ్చటే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 6: అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం కేంద్రం వద్ద ఎప్పుడూ చర్చకు రాలేదని బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. 2019 ఎన్నికల నాటికి 153 అసెంబ్లీ స్థానాలకు పెరుగుతాయని భావిస్తున్న ఆశావాహుల ఆశలపై నీళ్ళు చల్లినట్లయ్యింది. వివిధ పార్టీల నుంచి అధికార పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలకు, ఇతర నాయకులకూ నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి పోటీ చేసేందుకు ఇబ్బందులేమీ ఉండవంటూ టిఆర్‌ఎస్ భరోసా కల్పిస్తున్నది. కాగా సోమవారం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అంశమేదీ కేంద్ర ప్రభుత్వం వద్ద చర్చకు రాలేదని అన్నారు. నియోజకవర్గాల సంఖ్య పెరగాలా? అని ప్రశ్నించగా, అటువంటి ప్రతిపాదన వచ్చినప్పుడు పరిశీలించి చెబుతానని ఆయన చెప్పారు.