రాష్ట్రీయం

కారును ఢీకొన్న టిప్పర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముగ్గురి మృతి * మరో ముగ్గురికి గాయాలు
హైదరాబాద్, నవంబర్ 28: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవదర్శనానికి వెళ్తుండగా ఉమర్‌ఖాన్ గూడ వద్ద టిప్పర్..కారును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఉమర్‌ఖాన్‌గూడకు చెందిన నల్ల మాధవరెడ్డి (45), భార్య సురేఖ (36), మాధవరెడ్డి అత్త జక్కిడి లక్ష్మమ్మ (55), కూతురు యామిని (17), చిన్న కూతురు శిరీష (13), కుమారుడు భరత్ (14)లతో కలిసి శనివారం సాయంత్రం యాదగిరిగుట్టకు కారులో బయలుదేరారు. ఔటర్ రింగ్‌రోడ్డు సర్వీస్ రోడ్డు మీదుగా పెద్దఅంబర్‌పేట్ వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ కారును బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో మాధవరెడ్డి, కూతురు యామిని, అత్త లక్ష్మమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన సురేఖ, శిరీష, భరత్‌లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో భరత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. టిప్పర్ డ్రైవర్ పరారిలో ఉన్నాడు.