తెలంగాణ
ఫిరాయింపులపై టి.కాంగ్రెస్ నేతల భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 28 April 2016
హైదరాబాద్: తెరాసలోకి వలసల జోరు అధికం కావడంతో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గురువారం నగరంలో సమావేశమయ్యారు. ఫిరాయింపులను ఆపేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని పలువురు నేతలు భావిస్తున్నారు. ఈ భేటీకి ఎమ్మెల్సీలను పిలవకపోవడంపై ఖమ్మం జిల్లా నేత పొంగులేటి సుధాకర రెడ్డి అలక వహించగా ఆయనను కొందరు కాంగ్రెస్ నేతలు బుజ్జగించారు. అలాగే, నల్గొండ డిసిసి అధ్యక్షుడి పనితీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం నుంచి మధ్యలోనే నిష్క్రమించారు. మరికొందరు ఎమ్మెల్యేలు తెరాసలో చేరితే అసెంబ్లీలో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా గల్లంతవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.