తెలంగాణ
గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటే ఏడాది సస్పెన్షన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 29 February 2016
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ఎమ్మెల్యేలను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేయాలని తెలంగాణ అసెంబ్లీ రూల్స్ కమిటీ నిర్ణయించింది. ఇక్కడ సోమవారం జరిగిన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ నేతృత్వంలో ప్రొటోకాల్ కమిటీని నియమించాలని, ప్రశ్నోత్తరాల సమయంలో నిరసనలకు అనుమతి ఇవ్వరాదని కూడా నిర్ణయించారు. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ తదితరులు హాజరయ్యారు.