తెలంగాణ

మరో ముగ్గురు రైతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్/మహబూబ్‌నగర్ డిసెంబర్ 21: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడటం లేదు. కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తాజాగా మరో ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కరీంనగర్ జిల్లా ఎలిగేడు మండలం దూళికట్ట గ్రామానికి చెందిన ఇరుగురాళ్ల తిరుపతి (26) అనే రైతు ఆదివారం సాయంత్రం పత్తిచేను వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అదేవిధంగా ఇదే జిల్లా కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన సంతోషపు బక్క మల్లయ్య (45) అనే రైతు తన పత్తి చేనులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం మండలంలోని కానాపూర్‌లో అప్పుల బాధ భరించలేక బొక్క శ్రీను (38) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.