సబ్ ఫీచర్

ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధనుర్మాసం అత్యంత పవిత్రమైనది. మార్గశిర మాసం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ నెల్లోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని ఈ మాసంలోనే గోదాదేవి భక్తితో పూజించి తన భర్తగా పొందింది. రోజుకు ఒక్క పాసురంతో స్వామిని స్తుతించిన గోదాదేవి శ్రీమహావిష్ణువును ప్రసన్నంగా చేసుకుంది. ఈ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశినే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఈ మాసంలో ఎన్నో పర్వదినాలు. అందులో ఒకటి ముక్కోటి ఏకాదశి. పవిత్రమైన రోజు ఇది. ఈ రోజు ముఖ్యంగా వైష్ణవ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఉత్తర ద్వార మార్గంలో స్వామిని దర్శించుకోవాలని ఆ రోజు భక్తులు ఎంతో ఆరాటపడతారు. ఒక్క ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశలు వస్తాయి. ప్రతి ఏకాదశీ పవిత్రమైనదే.. అందులో మరీ విశేషంగా పరిగణించే ఏకాదశులు నాలుగు. ఆ విశేష ఏకాదశులలో ఒకటిగా పరిగణించేదే ఈ వైకుంఠ ఏకాదశి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. అసలు ఈ రోజుకు అంత ప్రాధాన్యం ఎందుకంటే..
ముక్కోటి ఏకాదశినాడు తెల్లవారుజామున నుంచే ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార భగవత దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజున వైకుంఠం వాకిళ్లు తెరచుకునే పర్వదినం. ముక్కోటి ఏకాదశినాడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందువల్లనే ముక్కోటి ఏకాదశి అని దీనికి పేరు. మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన ఈ ఏకాదశి పవిత్రత సంతరించుకున్నందువల్ల దీనిని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. దేవతలు, రాక్షసులు జరిపిన క్షీరసాగర మథనంలో ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. కాలకూట విషాన్ని పరమేశ్వరుడు తన గరళాన బంధించింది ఈ రోజే. మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించింది కూడా ముక్కోటి ఏకాదశినాడే అనేది ఒక విశ్వాసం. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో ఏడాదికి నాలుగుసార్లు మాత్రమే చక్రస్నానం జరుగుతుంది. ఏడాదిలో ఈ చక్రస్నానాలు జరిగే నాలుగుసార్లు ముల్లోకాల్లో ఉన్న పుణ్యతీర్థాలు స్వామి పుష్కరిణిలో సూక్ష్మరూపంలో ప్రవేశిస్తాయని విశ్వాసం. అనంతపద్మనాభ వ్రతం రోజున, బ్రహ్మోత్సవాలలో చివరిరోజున, వైకుంఠ ఏకాదశి మరునాటి తిథి ద్వాదశి ఉన్న రోజు, రథసప్తమి రోజు స్వామివారికి చక్రస్నానాలు జరుగుతాయి. అందుకే ఈ రోజున ప్రత్యేకించి వైష్ణవ ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు.
వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం గురించిన వివరణ అనేక పురాణాల్లో ఉంది. పద్మ పురాణం ప్రకారం కృతయుగంలో ‘ముర’ అనే రాక్షసుడు దేవతలను, సాధువులను క్రూరంగా హింసించేవాడు. ఈ మురాసురుని అక్రమాలు, ఆగడాలు భరించలేక దేవతలు మహావిష్ణువును శరణు వేడుకున్నారు. దేవతల మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు మురాసుర వధకు ప్రత్యేక అస్త్రం అవసరమని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. ఇదే అదనుగా భావించిన మురాసురుడు ఆ గుహలోకి ప్రవేశించి అక్కడే విశ్రమిస్తున్న విష్ణువును సంహరించేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు నుంచి ఒక శక్తి ఉద్భవించి మురాసురుణ్ణి సంహరించింది. ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే ‘ఏకాదశి’ అని నామకరణం చేశారు.
ఉపవాసం
వైకుంఠ ఏకాదశి రోజు అన్నం ముట్టకూడదు. ముర అనే రాక్షసుడు అన్నం రూపంలో ఉంటాడని ఒక విశ్వాసం అయితే, ఇంకో కథ ప్రకారం బ్రహ్మ తల నుంచి ఒక స్వేద బిందువు నేలపై పడి వెంటనే రాక్షస రూపం దాల్చింది. ‘ఓ బ్రహ్మదేవ, నాకు నివాస స్థానం చూపించు’ అని ఆ రాక్షస రూపం ప్రార్థించింది. ఏకాదశినాడు మానవులు భుజించే వరి అన్నంలో ప్రవేశించి తద్వారా వారి ఉదరాల్లో స్థావనం ఏర్పరచుకోమని బ్రహ్మ ఆ రాక్షస రూపానికి వరం ఇచ్చాడు. అందుకే ఈ రోజు శ్రీమహావిష్ణువును షోడశోపచారాలతో ఆరాధించి చాలామంది ఉపవాసం చేస్తారు.
వైష్ణవ ఆళ్వారులలో ప్రసిద్ధి చెందిన శ్రీనమ్మాళ్వారు కూడా ముక్కోటి ఏకాదశినాడే శివైక్యం చెందాడని ఒక విశేషంగా చెప్పుకుంటారు. శ్రీనమ్మాళ్వారులకు ఈ రోజునే విష్ణులోకం ప్రాప్తించడంతో శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశ వ్రతమాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలతోపాటు తిరుమల శ్రీవారి ఆయలంలోనూ ప్రాతఃకాలం నుంచే ప్రత్యేక ఉత్తర ద్వారం తెరచుకుంటుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభసంకేతం. ముక్కోటి ఏకాదశినాడు తెల్లవారుజాము నుంచే వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం కోసం వేచి ఉంటారు. వైకుంఠ వాకిళ్లు తెరుచుకునే పర్వదినం ముక్కోటి ఏకాదశినాడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై మూడుకోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. మనిషి తలపై సహస్రార శక్తి ఉత్తేజితమవడం కోసం కూడా ఉత్తర ద్వార దర్శనం భక్తులకు శుభప్రదం. *