Others

చిరుధాన్యాలతో రుచిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనమెప్పుడూ ఆహారపదార్థాల్లో ధాన్యానికే ఎక్కువ విలువనిస్తాం. కానీ చిరుధాన్యాలు కూడా ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటాయని నేటి భావన. వీటిని తీసుకోవడం వల్ల మనిషి తన ఆరోగ్యాన్ని మరింత భద్రం చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం..
* అన్నం తినడం కోసం మనమంతా తెల్లని పాలిష్ బియ్యాన్ని ఎంచుకుంటాం. కానీ వీటి బదులుగా దంపుడు బియ్యం మంచివి. కొర్రెలు, జొన్నలు, రాగులు కూడా అన్నం బదులు తినొచ్చు. వీటివల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభ్యమవడమే కాదు.. చెడు కొలెస్ట్రాల్ పెరగడాన్ని నియంత్రించవచ్చు.
* పిండివంటలు చేసేటపుడు బియ్యం బదులుగా గోధుమలు, జొన్నలు ల్లాంటివి వాడవచ్చు.
* సున్నుండలు చుట్టేటప్పుడు మినుములకు బదులు అటుకులు, కొర్రలు, జొన్నలు కూడా వాడితే రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం.
* వడలు, బోండాల్లాంటివి చేయడానికి కేవలం శనగ పప్పు, శనగ పిండిలను కాక గోధుమ పిండి, మొక్కజొన్న పిండిని వాడుకోవచ్చు.
* గోధుమ చపాతీలకు బదులు జొన్న, రాగి, మొక్కజొన్న, బార్లీ , ట్స్ తో చపాతీలు, రొట్టెలు చేసుకొంటే రుచిగా ఉంటాయి. వెరైటీగా కూడా ఉంటాయి.
* దోసెలను గోధుమ రవ్వ, కొర్రల పిండి, జొన్నపిండిలతో వేస్తే కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.
* బొబ్బట్లు తయారు చేయడానికి శనగపప్పు, బెల్లం కాక.. గెనుసు గడ్డలు అంటే స్వీట్ పొటాటో, పెసలతో చేస్తే బొబ్బట్లు మరింత రుచిగా ఉంటాయి. కందిపప్పు, గాజర్ కలపి చేసే బొబ్బట్ల రుచికి మాటలు ఉండవు.
* సాయంత్రం పిల్లలకు పిజ్జాల్లాంటి స్నాక్స్ కాక బఠానీలు, శనగ గుగిళ్లు, ఉడికించిన పల్లీలు, బొరుగులతో చేసిన వంటకాలు ఆరోగ్యానికి మంచిది.
* అప్పుడప్పుడు రాగి, జొన్న, మొక్కజొన్న ల్లాంటి పిండితో జావ చేసే ఉపాహారంగా తీసుకొంటే చాలా ఆరోగ్యకరం.
*