సబ్ ఫీచర్

పేదరిక నిర్మూలన గావించేదెప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

72 ఏళ్ళ స్వాతంత్య్ర భారతదేశంలో మన పాలకులు సాధించిన ప్రగతి ఎంతవరకు పేదరిక నిర్మూలనకు దోహదబడిందో బేరీజువేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఏళ్ళు గడిచినా, ఎన్ని రకాల పథకాలను ప్రవేశపెట్టినా పేదరికాన్ని నిర్మూలించలేక పోవడానికి గల కారణాలేవి?
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీష్‌వారు దాదాపు 200 సంవత్సరాలకు పైగా పాలించి ఇక్కడున్న సహజ వనరులను, విలువైన సంపదలను అక్కడికి తరలించారని చరిత్ర చెబుతున్నది, అలాగే భారతీయులకు ఎలాంటి ఉపయోగంలేని చట్టాలను చేసి అమలుపరచడం, ఇక్కడి ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేసేటటువంటి పాలన గావించినందుకే 1857 సిపాయిల తిరుగుబాటు, 1885-1947 స్వాతంత్య్ర సంగ్రామాన్ని చేసి ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధుల త్యాగఫలితంగా స్వాతంత్య్రాన్ని పొందడం జరిగింది.
స్వాతంత్య్రపు పోరాటంలో చివరగా క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్న సందర్భంలో యావత్తు భారతదేశమంతా పాల్గొని, విజయంలో కీలకపాత్ర వహించారంటే కారణం, బ్రిటిష్‌వారి పాలన ఏ విధంగా ఉన్నదో తెలియకనే తెలుస్తుంది.
1911లో దాదాబాయి నౌరోజీ బ్రిటిష్ అధికారుల వద్దకువెళ్లి నా భారతీయ పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించి అక్షరాస్యులుగా గావించండని మొరపెడితే వారు చేయకపోగా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సైతం అర్ధశతాబ్దం ఎదురుచూడాల్సి వచ్చింది.
స్వాతంత్య్రం వచ్చాక విద్య, వైద్య, వ్యవసాయం, పారిశ్రామిక, శాస్త్ర, సాంకేతిక రంగాలలో పలు మార్పులు వచ్చిన కూడా అభివృద్ధిని సాధించలేక పోతున్నామంటే అసలుకారణం ఏమిటో ఆలోచించాల్సిన అవసరం లేదా? దేశంలో నాడు 55 శాతమున్న వ్యవసాయదారులు నేడు ఎంత శాతానికి పరిమితమయ్యారు. భూమిలేని రైతులు అలానే ఉంటే, చిన్న, సన్నకారు రైతులుసైతం అప్పులపాలై కొందరు, ఎలాంటి నీటి వసతి లేకపోవడంతో వారి భూములను అమ్ముకోవడం, నగరాలకు వలసలు వెళ్లడం జరుగుతున్నది.
పట్టణాలకు, నగరాలనుండి వెళ్ళే రహదారుల ప్రక్కనవున్న భూములను ధనవంతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధిక ధర చెల్లించి తీసుకొని చుట్టూర కంచేవేయడం, అందులో వివిధ పండ్లతోటలు పెంచడం, ఇక్కడ ఇంకా దురదృష్టకరమైన విషయమేమిటంటే ఆ పొలంలోనే అమ్మిన వ్యక్తి జీవితానికి కుదరడం, ఎక్కడైనా అన్ని నగరాలనుండి వెళ్ళే రహదారుల ప్రక్కబోటి వుండే భూములు ఏనాడో వ్యవసాయం చేయని వ్యక్తుల చేతిలోకి వెళ్లాయి. ఓనాడు విలువలేని చిరుధాన్యాల పంటలు, వ్యవసాయ రైతులు పండించడం ఆపాక, పెద్దపెద్ద భవంతులలో, చల్లని గదులు ఏర్పాటుచేసి, మనిషికి కావాల్సిన అన్నింటిని ఒకేచోట దొరికేవిధంగా మార్టులను నడుపుతూ అందులో చిరుధాన్యాలను అమ్మడం, ఎక్కువ ధర చెల్లించి తీసుకుంటూ, అధిక ప్రాధాన్యత నివ్వడం జరుగుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఇలాంటి షాపింగ్ మాల్‌లను నడిపే యాజమాన్యమే, వ్యవసాయదారుల నుండి భూమిని కొనుగోలుచేసే వారితోనే కూలీకి పనులు చేయించుకుంటూ తమకు కావాల్సిన పంటలను పండించుకుంటూ కార్పొరేట్ వ్యవసాయం చేస్తున్నారు.
ఆనాడు బ్రిటీషువారు దోచుకున్నారు. నేడు వారి స్థానంలో కార్పొరేటు వ్యవస్థ ఉండటం గమనార్హం. నేటి కార్పొరేటు వ్యవస్థలు ప్రభుత్వాలను సైతం శాసించే స్థాయికి ఎదుగుతున్నాయంటే ఎలాంటి అతిశయోక్తిలేదు.
స్వాతంత్య్రం లభించాక అభివృద్ధి కార్యక్రమాలు బాటలువేశారు. పంచవర్ష ప్రణాళికలు తీసుకువచ్చి, ఒక్కొక్కసారి ఒక్కో రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఉండటం జరిగింది. కానీ అభివృద్ధి మాత్రం అనుకున్నంత మేరలో జరగలేదని చెప్పవచ్చు. నేడు వాటి స్థానంలో నీతి ఆయోగ్ అభివృద్ధికి బాటలువేయడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అభివృద్ధి ఎంత సాధించిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైననే ఉన్నది. విద్యాహక్కు చట్టాన్ని తెచ్చి అక్షరాస్యతలో అభివృద్ధి సాధిస్తున్నారు. కానీ నిరుద్యోగులను కూడా అంతేమేరలో పెంచుతున్నారు.
వలసలను అరికట్టడానికి గ్రామాలలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి, గ్రామాలలో ఉపాధిని కల్పించడానికి ప్రయత్నంచేస్తున్న, శాశ్విత వలసలను ఆపలేకపోతున్నారు. అవినీతిని అరికట్టడానికి సమాచార హక్కు చట్టాన్ని తెచ్చిన, ఇప్పటికి గ్రామస్థాయిలో దాని గురించి తెలియకపోవడం బాధాకరం. అవినీతిని అడ్డుకోలేకపోతున్నాము. ఇంకెక్కడా అభివృద్ధి? ఈ ప్రజాస్వామ్యంలో ఎంత అనుభవం గలిగిన నాయకుల్ని ఎన్నుకున్నా కూడా, వారి శాశ్వత పాలనకై తాత్కాలిక వాగ్దానాలే తప్ప, శాశ్వత పరిష్కారం ఎక్కడా కనిపించడం లేదు. గత ఇరవై సంవత్సరాలనుండి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా మనుగడలో ఉన్నది కానీ ఎన్నడూ అభివృద్ధిచెందిన దేశంగా నామకరణం చేసుకుంటుందో తెలియని పరిస్థితి.
నేటి పాలకులు ప్రజాస్వామ్యం అంటారు గానీ, ఎవ్వరికి అవకాశం ఇవ్వరు, సమాజ శ్రేయస్సుకు పాల్పడేవారికి ఎలాంటి అవకాశం రాదు. అలాఅని సమాజాన్ని చైతన్యంచేయడానికి ముందుకొచ్చిన వారికి ఎన్నికలలో డిపాజిట్ కూడా దక్కనివ్వరు. అలాంటి రాజకీయాలను నేర్పుతున్నారు మన పాలకులు. ఎన్నికలు ఎప్పుడొస్తాయి? ఎలాంటి వాగ్దానాలను ఇవ్వాలి? ఎలా ఎన్నికల్లో గెలవాలి? అని ఆలోచిస్తారే తప్ప, సమాజ శ్రేయస్సుకై పాల్పడే నాయకులున్నారా? అంటే ఇక్కడ వారిదొక్కరిదే తప్పుకాదు, ప్రజలది సైతం అంతే తప్పుఉన్నది. ఎందుకంటే ఎప్పుడైతే ఎన్నికల్లో వారిచ్చే తాయిలాలపై ఆధారపడి ఓటువేసే సమయం వచ్చిందో, అభివృద్ధిని కాంక్షించడం వారి తప్పే.
నేటి రాజకీయాలు మామూలు మనుషులకు అర్థం కావడంలేదు. నేటి రాజకీయ నాయకులు ప్రాంత, దేశాభివృద్ధికంటే కూడా తాము ఎలా అధికారంలోకి రావాలి? ఎలాంటి వాగ్దానాలుచేయాలి? ఎలా ఓటర్లను ఆకర్షించాలి? ఎలా పాలక పగ్గాలు చేపట్టాలి? ఎన్నికయిన నాటినుంచే మరో ఐదేళ్లకు వచ్చే ఎన్నికలకు ఎలా వనరులను సమకూర్చుకోవాలను ఆలోచిస్తున్నారే తప్పా! అభివృద్ధికై పాటుపడే నాయకులే కరువైనారనడంలో ఎలాంటి అవాస్తవం లేదు.
ప్రత్యేకంగా దేశంలో నేడు నిరుద్యోగిత విజయతాండవం చేస్తుంటే వ్యవసాయదారులను పట్టించుకునే నాధుడే కరువయ్యారు. కార్పొరేటు వ్యవస్థ కోరలుతెరుచుకొని మనుగడ సాగిస్తూ పాలకులనే శాసించే స్థాయికి ఎదుగుతుంది.
అంతా వ్యాపారమైన ధనార్జనకై పాటుపడుతున్నారు కానీ, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడానికి ప్రయత్నంచేసేవారు కరువైనారు. అలాగే చేస్తున్నట్లు ప్రకటనలకు మాత్రమే పరిమితమవుతున్నారు.
దేశంలో ఉపాధి వనరులు కల్పించినప్పుడే అభివృద్ధికి బాటలు ఏర్పడతాయి. నిరుద్యోగిత నిర్మూలనకు పాటుపడాలి. వ్యవసాయాన్ని అభివృద్ధిచేస్తూ వలసలను శాశ్వతంగా నిలిపివేయడానికి ప్రయత్నించాలి. కార్పొరేటు వ్యవస్థపై కొరడా ఝళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రాజకీయాన్ని రాజకీయాల కోసం గాకుండా ప్రజల క్షేమాన్ని, సంక్షేమాన్ని గావించే విధంగా ఉండాలి. ఇప్పటికైనా పాలకులు దేశ అభివృద్ధికై పాటుపడుతూ దేశాన్ని త్వరలో అభివృద్ధి చెందిన దేశంగా చేయడానికి ప్రయత్నం చేయాలని ఆశిద్దాం.

- డా. పోలం సైదులు