రాష్ట్రీయం

తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు ఏపీ ఎన్జీవో సంఘం మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 19: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖరరెడ్డి, సెక్రటరీ బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అఖిల భారత రాష్ట్ర ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు విజయవాడలోని ఇరిగేషన్ కార్యాలయ కాంపౌండ్‌లో శనివారం భోజన విరామ సమయంలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు సంఘీభావంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని నెరవేర్చకపోవడంతో ఆర్టీసీ సిబ్బంది గత 14 రోజులు నుండి తమ కోరికల సాధనకు సమ్మె చేస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులతో చర్చలు జరపకుండా నిరంకుశ ధోరణి అవలంబిచడం సరి కాదన్నారు. ఇప్పటికైనా తెలంగాణా ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి ఆర్టీసీ ఉద్యోగులను సంప్రదింపులకు పిలవాలన్నారు.