రాష్ట్రీయం

సహకార చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు నిపుణుల కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: రాష్ట్రంలో ఖాయిలా పడిన ఆరు సహకార చక్కెర కర్మాగారాలను పునరుద్ధరణకు సాంకేతిక నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వివిధ కారణాల వల్ల ఖాయిలా పడిన సహకార చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కోసం బడ్జెట్‌లో 100 కోట్ల రూపాయలను కేటాయించింది. కడప, శ్రీవేంకటేశ్వర, చిత్తూరు, కొవ్వూరు, అనకాపల్లి, ఎన్వీఆర్ అండ్ ఏడీఆర్ (జంపని) కర్మాగారాల పునరుద్ధరణకు ఉన్న అవకాశాలు, రోడ్ మ్యాప్, పునర్ వ్యవస్థీకరణ, కావలసిన అదనపు కార్మికులు, మరమ్మతులు, యంత్రపరికరాల మార్పు, చెరకు పంట అభివృద్ధికి చర్యలు తదితర అంశాలపై ఈ నిపుణుల కమిటీ నివేదిక అందచేయాల్సి ఉంటుంది.