రాష్ట్రీయం

17 మంది టీటీడీ నూతన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నూతన టీటీడీ ధర్మకర్తల మండలి 17 మంది సభ్యులు తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం 9 నుంచి 10.30 గంటల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఎక్స్ అఫిషియో సభ్యులైన ఏపి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్, టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, ఎండోమెంట్స్ కమిషనర్ పద్మజ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం సభ్యులు మేడా మల్లికార్జున రెడ్డి, బి.పార్థసారథి రెడ్డి, పి.ప్రతాప్ రెడ్డి, డాక్టర్ నిచితా, కె.పార్థసారథి, మురళీకృష్ణ, ఎన్.శ్రీనివాసన్, జె.రామేశ్వర రావు, ఎన్.సుబ్బారావు, జి.వెంకట భాస్కర్ రావు, డి.దామోదర్ రావు, ఎం.ఎస్.శివశంకరన్, కుమారగురు, సి.ప్రసాద్‌కుమార్, ఎం.రాములు, కె.శివకుమార్, యు.వి.రమణమూర్తి రాజు ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం గరుడాళ్వార్ సన్నిధిలో పాలకమండలి సభ్యులతో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ ప్రమాణ స్వీకారం చేయించారు.ప్రమాణ స్వీకారం చేసిన 17 మందిలో ఐదుగులు ఆంగ్లం లో, మిగిలిన వారు తెలుగులో ప్రమాణం చేశారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన వారిని ధర్మకర్తల మండలి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అభినందించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో గౌరవ సభ్యులకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. తిరుమల ప్రత్యేకాధికారి ఏ.వి.్ధర్మారెడ్డి రంగనాయకుల మండపంలో బోర్డు సభ్యులందరికీ శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.
కాగా ముగ్గురు సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే.ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో గోపీనాథ జెట్టి, అదనపు సీవీఎస్వో శివకుమార్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

*చిత్రం... ప్రమాణ స్వీకారం చేసిన టీటీడీ నూతన ధర్మకర్తల మండలి సభ్యులు