రాష్ట్రీయం
పార్టీ మారితే రాజీనామా చేసే వెళ్తా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాగు పడాలంటే కుంతియా, ఉత్తమ్కుమార్రెడ్డిని బాధ్యతల నుంచి తప్పించాలని కాంగ్రెస్ పార్టీ మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి అభిప్రాయపడ్డారు. వీరిద్దరు ఉన్నంత కాలం రాష్ట్రంలో కాంగ్రెస్కు భవిష్యత్ లేదన్నారు. అసెంబ్లీ లాబీల్లో బుధవారం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్కు యువ నాయకత్వం వస్తే భవిష్యత్ ఉంటుందన్నారు. కాంగ్రెస్కు నాయకత్వం లోపం వల్ల రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్నారు. పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినప్పుడే కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. సాంకేతికంగా మరో నాల్గేళ్లు తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని అన్నారు. బీజేపీలో చేరాలను కంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే వెళ్తానని స్పష్టం చేశారు. హరీశ్రావును తాను కలిసింది డిండి ప్రాజెక్టు భూ సేకరణకు నిధుల కోసమేనని ఆయన అన్నారు. హరీశ్రావు తనకు కాలేజిలో చదువుకునే రోజుల నుంచే తెలుసన్నారు.