రాష్ట్రీయం

తెలంగాణలో టీడీపీ జెండా రెపరెపలాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్,సెప్టెంబర్ 14: తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తానని ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం తెలంగాణలో పుట్టిందన్నారు. తెలంగాణలో టీడీపీ బలపడడం చారిత్రాత్మకం కావాలన్నారు. టీడీపీ ఎన్నో సంక్షోభాలు, సవాళ్లను ఎదుర్కొన్న పార్టీగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో కొంతమంది స్వార్థపరులు పార్టీని వీడివెళ్లినా నష్టం లేదన్నారు. ఒక నాయకుడుపోతే వందమంది నాయకులను తయారు చేస్తానన్నారు. పార్టీ నుంచి వెళ్లిన నేతలు మళ్లీ పార్టీలో రావాలని ఆయన పిలుపునిచ్చారు. కేసుల నుంచి భయపడాల్సిన అవసరం లేదని, వారికి అండగా నిలబడతానని ఆయన భరోసా ఇచ్చారు. త్వరలో పార్లమెంట్ పార్టీ వారీగా సమీక్షలు చేపడుతున్నట్లు చెప్పారు. పార్టీ సమీక్షలు తర్వాత రాష్ట్ర కమిటీలు వేస్తానని కేడర్‌కు సూచించారు. తెలంగాణలో టీడీపీ జెండాలు రెపరెపలాడాలని కేడర్‌కు ఆయన హితబోధ చేశారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయంలో అందరికీ అందుబాటులో ఉంటానన్నారు. హైదరాబాద్‌తో పాటు అన్ని ముఖ్యమైన భవంతులను తన హయాంలోనే జరిగాయన్నారు. ఐటీ రావడానికి తన కృషి అంటూ పార్టీ నేతలకు సూచించారు. తెలంగాణ, ఆంధ్రాలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత చంద్రబాబు హైదరాబాద్ కేంద్ర పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. సుమారు 9 నెలలు అనంతరం పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వచ్చారు.
*చిత్రం...ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శనివారం పార్టీ తెలంగాణ నేతలతో సమావేశమైన చంద్రబాబు నాయుడు