రాష్ట్రీయం

దేవుడు రాసిన స్క్రిప్ట్ అదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 15: రాష్ట్ర రాజధాని అమరావతిని, సచివాలయ ఆవరణను ప్రస్తుత ప్రభుత్వం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలోని కీలక భవనాలకు, రహదారులకు మూడు రంగుల కాంతిని వెదజల్లే విద్యుత్ దీపాలతో అందంగా అలకరణ చేశారు.
దీనిపై చంద్రబాబు ట్విట్టర్‌లో స్పందిస్తూ.. దేవుడు భలే స్క్రిప్ట్ రాశాడని వ్యాఖ్యానించారు. ఎవరైతే రాజధాని అమరావతిని భ్రమరావతి అని, గ్రాఫిక్స్ మయమని విమర్శించారో.. దేవుడు ఇప్పుడు వాళ్లతోనే అమరావతికి లైటింగ్ వేయించి, అందంగా చూపించేలా చేశాడని వ్యాఖ్యానించారు.