రాష్ట్రీయం

మహిళా కమిషన్ రాష్ట్ర చైర్మన్‌గా వాసిరెడ్డి పద్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్‌గా వైకాపా సీనియర్ నాయకురాలు వాసిరెడ్డి పద్మను నియమిస్తూ మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఈ పదవిలో నన్నపనేని కొనసాగారు.
డెయిరీల పరిపుష్టికి ప్రత్యేక కమిటీ
రాష్ట్రంలో నానాటికీ కునారిల్లుతున్న ప్రభుత్వ డెయిరీల పరిపుష్టికిగాను పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడులతో ఒక ప్రత్యేక కమిటీని ముఖ్యమంత్రి జగన్ మంగళవారం రాత్రి ఏర్పాటు చేశారు. డెయిరీ రంగంలో అనుభవం కల్గిన బ్రహ్మనాయుడు సేవలను వినియోగించుకోవాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు.