రాష్ట్రీయం
చాలారోజుల తరువాత సచివాలయానికి సీఎం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 19 April 2019
విజయవాడ: దాదాపు 45 రోజుల తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం సచివాలయానికి వచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి ముందు నుంచే ఆయన సచివాలయానికి రావడం తగ్గించి, ఉండవల్లి ప్రజావేదిక నుంచే సమీక్షలు, పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ ముగిశాక తొలిసారిగా ఆయన సచివాలయానికి వచ్చారు. ఉదయం 11 గంటలకు రాజధాని అమరావతి పనుల పురోగతిపై సమీక్షించారు. ఆ తరువాత శాంతిభద్రతలపై సమీక్షించేందుకు నిర్ణయించారు. సీఆర్డీఏ సమావేశానికి మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ శ్రీ్ధర్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరవుతారని భావించినా, ఆయన రాలేదు. శాంతి భద్రతలపై సమీక్షను హోం మంత్రి చినరాజప్ప నిర్వహించారు.