క్రీడాభూమి

కోహ్లీ, వార్న్ దిగ్భ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: ఎన్‌బీఏ లెజెండ్ కోబె బ్రియాంట్ అకాల మరణం పట్ల ప్రపంచ క్రికెట్ రంగం సోమవారం దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని భారత క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లి, ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ నివాళులు అర్పించారు. ఈ వార్త తమనెంతగానో కలచివేసిందని, 41 సంవత్సరాల్లో బ్రియాంట్ బాస్కెట్ బాల్ క్రీడాకారుడిగా ఎన్నో అద్భుతాలు సృష్టించాడన్నారు. చిన్నతనం నుంచి తెల్లవారుజామునే నిద్రలేచి బ్రియాంట్ మ్యాచ్‌లను తిలకించి అతనిలాగే ఆడటం చేసేవాడినని ఈ సందర్భంగా కోహ్లి గుర్తు చేసుకున్నాడు. కాగా ప్రపంచ క్రీడా రంగం ఓ నిజమైన దిగ్గజాన్ని కోల్పోయిందని వెస్టిండీస్ మాజీ దిగ్గజ బ్యాట్స్‌మన్ రిచార్డ్స్ వ్యాఖ్యానించాడు. అలాగే భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మాజీ శ్రీలంక కెప్టెన్ మహేళ జయవర్దనే సైతం బ్రియాంట్ కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు.