క్రీడాభూమి
ధావన్ స్థానంలో శాంసన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ: వెస్టిండీస్తో స్వదేశంలో జరుగబోయే టీ-20 ఇంటర్నేషనల్ సిరీస్లో పాల్గొనే 15 మందితో కూడిన భారత జట్టులో సంజూ శాంసన్కు చోటు దక్కింది. ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో మిడిలార్డర్ బ్యాట్స్మన్ శాంసన్ జట్టులోకి వచ్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20లో మహారాష్టత్రో జరిగిన మ్యాచ్లో 33 ఏళ్ల ధావన్ మోకాలికి బలమైన గాయం తగిలింది. దీంతో సెలక్టర్లు అతని స్థానంలో శాంసన్ను ఎంపిక చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 25 ఏళ్ల కేరళ బ్యాట్స్మన్ శాంసన్కు టీ-20 స్పెషలిస్టుగా పేరుంది.
సాహా వేలికి గాయం
టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా చేతి వేలికి గాయం తగలడంతో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నట్టు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ ఒక ప్రకటనలో తెలిపింది. బంగ్లాదేశ్తో ఇటీవల కోల్కతాలో ఇటీవల డే/నైట్ టెస్టు మ్యాచ్ ఆడుతున్న సమయంలో సాహాకు గాయమైనట్టు పేర్కొంది. త్వరలోనే అతనికి శస్త్ర చికిత్స జరుగుతుందని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది.
విండీస్తో టీ-20 సిరీస్కు
ఎంపికైన భారత జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శివం దూబే, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ చాహర్, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, సంజూ శాంసన్.
*చిత్రం... సంజూ శాంసన్