క్రీడాభూమి

రెండో రౌండ్‌కు శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 27: మూడో సీడ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ ఇక్కడ ప్రారంభమైన సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో రెండో రౌండ్‌కు చేరాడు. తొలి రౌండ్‌లో అతను రష్యాకు చెందిన వ్లాదిమిర్ మాల్కొవ్‌ను 21-12, 21-11 తేడాతో కేవలం 36 నిమిషాల్లోనే ఓడించి ముందంజ వేశాడు. రెండో రౌండ్‌లో అతను తన సహచర ఆటగాడు పారుపల్లి కశ్యప్‌తో తలపడతాడు. కశ్యప్ తొలి రౌండ్‌లో ఫ్రెంచ్ ఆటగాడు నుకాస్ కోర్విని ఢీకొనాల్సి ఉంది. అయితే, అతను ఫిట్నెస్ సమస్యతో వాకోవర్ ఇవ్వడంతో కశ్యప్ రెండో రౌండ్‌కు చేరాడు. ఇలావుంటే, 18 ఏళ్ల సంచలన ఆటగాడు లక్ష్య సేన్ కూడా రెండో రౌండ్ చేరాడు. గత వారం స్కాటిష్ ఓపెన్ టైటిల్‌ను గెల్చుకున్న అతనికి మొదటి రౌండ్‌లో ఫ్రెంచ్ షట్లర్ థామస్ రూక్‌సెల్ నుంచి వాకోవర్ లభించింది. కాగా, హస్మిత చాలియా 21-16, 21-16 తేడాతో వృషాలి గుమ్మడిని ఓడించి, మహిళల సింగిల్స్‌లో రెండో రౌండ్ చేరింది.