క్రీడాభూమి
పీబీఎల్ నుంచి వైదొలగిన సైనా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 24 November 2019
న్యూఢిల్లీ, నవంబర్ 24: భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ రాబోయే ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) నుంచి వైదొలగింది. రాబోయే సీజన్పై దృష్టి కేంద్రీకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె ప్రకటించింది. గత పీబీఎల్లో ఆమె ఈస్టర్న్ వారియర్స్ తరఫున ఆడింది. ఐదో పీబీఎల్ జనవరి 20 నుంచి ఫిబ్రవరి 9 వరకు జరగనుంది. ఈ టోర్నీలో తాను పాల్గొనడం లేదని ఆమె ఒక ప్రకటనలో పేర్కొంది. అభిమానులకు క్షమాపణలు చెప్పుకొంటున్నానని, కానీ, వచ్చే సీజన్పై దృష్టి కేంద్రీకరించాలంటే ఈ నిర్ణయం తప్పదని తెలిపింది.
*చిత్రం... భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్