క్రీడాభూమి

వీనస్ శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, సెప్టెంబర్ 29: ప్రపంచ మాజీ నంబర్ వన్ వీనస్ విలియమ్స్ ఇక్కడ జరుగుతున్న చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో ఆమె 6-3, 4-6, 7-5 ఆధిక్యంతో బార్బరా స్ట్రయికోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించింది. తొలి సెట్‌ను సునాయాసంగానే గెల్చుకున్నప్పటికీ, రెండో రౌండ్‌లో ఎదురైన గట్టిపోటీని ఎదుర్కోలేక చేతులెత్తేసింది. అయితే, చివరిదైన మూడో సెట్‌లో ఆమె చివరి వరకూ తీవ్రంగా పోరాటాన్ని కొనసాగించి, విజయం సాధించింది. కాగా, ఇతర మ్యాచ్‌ల్లో ఎలినా స్విటోలినా 6-7, 6-1, 6-2 తేడాతో అనస్టాషియా సెవత్సోవాను ఓడించింది. యూలియా అంటోనొవా పుతిట్సెవా 6-0, 6-1 ఆధిక్యంతో అనా బ్లికొవాను చిత్తుచేసింది. జెంగ్ సయ్‌సాయ్ 4-6, 6-3, 7-6 స్కోరుతో మోనికా పంగ్‌పై గెలుపొందింది. అమెరికా యువ క్రీడాకారిణి స్లొయెన్స్ స్టెఫెన్స్ 7-5, 6-3 తేడాతో లినెట్‌ను ఓడించి, రెండో రౌండ్ చేరింది.
కాగా, కెరీర్‌లో రెండు పర్యాయాలు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్న గార్బెనె ముగురుజా తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై నిష్క్రమించింది. అమెరికా క్రీడాకారిణి సొఫియా కెనిన్ ఆమెను 6-0, 2-6, 6-2 తేడాతో ఓడించింది.