క్రీడాభూమి
ఆసియా టేబుల్ టెన్నిస్ క్వార్టర్స్లో భారత్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 17 September 2019
యోగ్యకర్తా (ఇండోనేసియా), సెప్టెంబర్ 17: ఐటీటీఎఫ్ ఆసియా టేబుల్ టెన్నిస్ చాంపియన్ షిప్లో శరత్, కమల్ , సాథియాన్, హర్మీత్ దేశాయ్లతో కూడిన భారత పురుషుల జట్టు క్వార్టర్స్ ఫైనల్కు చేరింది. గ్రూపు దశలో కువైట్, శ్రీలంక జట్లను చిత్తు చేసి నాకౌట్ చేరిన భారత బృందం అక్కడ తొలుత సౌదీ అరేబియాపై 3-1 తో గెలిచింది. ఆ తర్వాత 3-0తో థాయ్లాండ్ను ఓడించి క్వార్టర్స్కు దూసుకెళ్లింది. అంతకుముందు సోమవారం జపాన్తో జరిగిన మ్యాచ్లో 1-3 తేడాతో ఓడినా టోర్నమెంట్ ఆరో స్థానంలో నిలిచింది. ఇదిలాఉంటే 2021లో జరిగే చాంపియన్షిప్కు నేరుగా అర్హత సాధించింది. భారత్ బుధవారం టాప్-5లో నిలిచిన హంకాంగ్తో తలపడనుంది.