శిప్ర వాక్యం

ఇంటా బయటా విజృంభించిన శత్రువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఫిబ్రవరి 20న మాట్లాడుతూ ‘‘ప్రతీకార దాడులపై భారత్ చర్య తీసుకుంటే సహించం’’ అని హెచ్చరించారు. ఈ వాక్యానికి అర్థం ఏమిటి? పాకిస్తాన్ నిరంతరం డెబ్బది సంవత్సరాలుగా భారత్‌పై దాడులు చేస్తూనే ఉంది. విద్వేషం బీజంగా అంకురించిన మత వృక్షం పాకిస్తాన్ పుల్వామా అనే (కాశ్మీరు)లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన దాడిలో ఫిబ్రవరి 2019 రెండవ వారంలో దాదాపు 50 మంది భారత సైనికులు మేజర్ స్థాయి అధికారులు చనిపోయారు. మొగుడ్ని కొట్టి మొగసాల ఎక్కిందన్న సామెత చందంగా పాకిస్తాన్ యు.ఎన్.ఒ. కు లేఖ వ్రాస్తూ భారత్ మాపై ప్రతీకార చర్యలు తీసుకోకూడదు అని కోరింది.
ఇందలి తర్కం ఏమిటి?
1) జైషే మహమ్మద్ సంస్థను 2002లో నిషేధించాము అని పాకిస్తాన్ చెప్పింది. ఐతే ఆ సంస్థ కార్యాలయం పాకిస్తాన్‌లో సక్రియంగా ఉంది. సిమి, జైషే మహమ్మద్, ఐసిస్ లష్కరే తోయిబా వంటి నలభై సంస్థలు కాశ్మీరులో పనిచేస్తున్నాయి. వీటన్నిటి లక్ష్యం భారత్‌ను వాహిబ్ ఇస్లామిక్ ఫండమెంటల్ దేశంగా మార్చటం. చైనా పాకిస్తాన్ కలిసి ఉగ్రవాదులను ఇండియాలో ప్రవేశపెట్టడం, మన దేశంలోని పౌరులను రాడికలైజ్ చేయటం దాదాపు 70 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది.
2) పుల్వామా ఉగ్రవాద కారు బాంబు దాడిలో పాల్గొన్న జైషే మహమ్మద్ సభ్యుడు కాశ్మీరు వాడేనని పాక్ వివరణ ఇచ్చింది. నిజమే. అతనికి శిక్షణ ఇచ్చింది పాకిస్తాన్. అందుకు అవసరమైన మందుగుండు సామాగ్రిని అందించింది పాకిస్తాన్. అవసరమైతే ఇండియాపై వెయ్యేండ్లపాటు యుద్ధం చేస్తాం అన్నాడు జుల్‌ఫికర్ ఆలీ భుట్టో. ఈ ద్వేషానికి కారణం ఒకటే. హిందువులనే వారికి భూమిపై జీవించే హక్కులేదని ఈ టెర్రరిస్టులు గాఢంగా నమ్ముతున్నారు. ఇదే 1400 సంవత్సరాలుగా సాగుతున్న జీహాదీ పోరాటాల సారాంశం.
3) ఉగ్రవాద దాడి తాము చేశాం అని ఆధారం చూపితే చర్య తీసుకుంటాము అని పాక్ ప్రధాని అన్నారు. బొంబాయి దాడి జరిగి పాతికేళ్లు అయింది. మూడువందల మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు పాకిస్తాన్‌కు అందజేసినా దావూద్ ఇబ్రహీం వంటి వారిని పాకిస్తాన్ నేటికీ పెంచి పోషిస్తున్నది. అంటే పుల్వామా దాడికి ఆధారాలు చూపినా ఎటువంటి చర్యలూ పాక్ తీసుకోదు అని తాత్పర్యం.
***
టెర్రరిజం ఆధారంగా మావోయిజం, ఇస్లాం విజయాలు సాధించాయి. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం లభిస్తుందని వీరు నమ్ముతున్నారు. లక్షలాది మంది ప్రజల గొంతులు కోసి పాకిస్తాన్ 1947లో సాధించారు. 6 లక్షల మంది కాశ్మీరీ హిందూ పండిట్లను కాశ్మీరునుండి తరిమివేశారు. స్వాతంత్య్రం వచ్చినప్పుడు పాకిస్తాన్‌లో లాహోరు వంటి హిందూ మెజారిటీ ప్రాంతాలు నేడు హిందూ మైనారిటీ ప్రాంతం. చైనాలో 14 శాతం మంది ఆనాడు పాకిస్తాన్‌లో హిందువులు ఉండగా ఈనాడు ఒక్క శాతం కూడా లేరు. దీనికి యు.ఎన్.ఒ. మానవ హక్కుల సంఘంవారు ఎందుకు నోరెత్తరు? ఉగ్రవాదులకే అన్ని మానవ హక్కులూ ఉంటాయా? నెహ్రూ కుటుంబం చేసిన పాపాలకు భారతదేశం బలి అయిపోయింది.
కాశ్మీరునే కాదు మొత్తం భారత్‌ను తమ దేశంలో కలుపుకోవాలని పాకిస్తాన్ చైనాలు ప్రయత్నిస్తున్నాయి.
ఇండియాపై తాము దాడి చేయవచ్చు. కానీ అందుకు భారత్ ప్రతీకార చర్యలు తీసుకోకూడదు- అని పాకిస్తాన్ వాదిస్తున్నది. ఈ వాదాన్ని ప్రపంచం హర్షిస్తుందా? అమెరికాలోని స్టేట్ ఎంపైర్ బిల్డింగ్‌ను తాలిబన్ ఉగ్రవాదులు ధ్వంసంచేస్తే అమెరికా శాంతి మంత్రం పఠించలేదు సరికదా వెంటపడింది వేటాడి ఒసామాబిన్ లాడెన్ని హతమార్చి ఆ శవాన్ని సముద్రంలో పడేసింది. మరి ఇవ్వాళ పాకిస్తాన్ అనే ఉగ్రవాద దేశాన్ని నిర్వీర్యం చేయాలా? వద్దా? అమెరికా చెప్పాలి.
చేయవలసిన దుర్మార్గమంతా చైనా చేసి ‘సరిహద్దుల్లో ఉద్రిక్తతలు వద్దు’ అని చైనా 20 ఫిబ్రవరినాడు హితబోధ చేసింది. చత్తీస్‌గఢ్‌లో 74 మంది భారత సైనికలను చంపింది ఈ చైనా ప్రేరేపిత ఉగ్రవాదులే. అంటే యుద్ధాలు చేసేందుకు చైనా పాకిస్తాన్‌లకు ప్రపంచంలో పేటెంటు హక్కు ఉన్నదా??
***
కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కన్పడుతుంది. రాజకీయ లబ్ధికోసం వివిధ స్కాముల పాములనుండి తప్పించుకోవటం కోసం దేశభక్తిని విసర్జించి వైదేశిక అరుణ సులోచనాలు ధరించి మమతాబెనర్జీ స్వామి అగ్నివేశ్ వంటివారు వీర జవానుల బలిదానాన్ని డ్రామాగా వర్ణిస్తే దానికి నారా చంద్రబాబునాయుడు సమర్థిస్తే ఇక ఈ దేశానికి భవిష్యత్తు ఉందా? అని అనుమానం కలుగుతుంది.
ఫిబ్రవరిలో ఇండియాకు వచ్చిన సౌదీ యువరాజు కూడా ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని పిలుపునిస్తే ఇండియాలోని పాక్-చైనా ప్రేరేపిత ఉగ్రవాద సమర్థకులు యూరీ-పుల్వామా దాడులను కాశ్మీరులో రాళ్లు రువ్వే డ్రగ్గిస్టును సమర్థించటం ఏమిటి? మాదకద్రవ్యాలకు అలవాటుపడిన విద్యార్థులు ‘డ్రగ్స్’ కొనుక్కోవటంకోసం ఐసిస్ సంస్థలో చేరి ఉగ్రవాదులుగా మారి దిన బత్తెం సంపాదించుకుంటున్నారని ప్రపంచానికి తెలియదా?
పాకిస్తాన్‌ను బెలూచిస్థాన్ సింథ్, పాకిస్తాన్ అనే మూడు దేశాల కింద విభజించడానికి ఇదే తగిన సమయం అని యోగా గురు రాందేవ్‌బాబా అన్నారు. ఆ పని జరిగేవరకు ఎన్నికల గుర్రాలను కొంతకాలం నిలిపివేయండి. నౌ ఆర్ నెవర్ అన్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవర్తించాలి!
కె.ఏ. పాల్ ఒక రాజకీయ పార్టీ స్థాపించాడు. తాను ముఖ్యమంత్రి కాబోతున్నట్లు ప్రకటించుకున్నాడు. ఇదెలా సాధ్యం? తనను శాంతి దూతగా 200 దేశాలవారు గుర్తించారు అని చెపుతున్నాడు. జగన్‌రెడ్డి 3 1/2 లక్షల కోట్లు ప్రజాధనం తిన్నాడు. చంద్రబాబు 3 లక్షల కోట్ల ప్రజాధనం తిన్నాడు. తాను తన స్వంతది 3 లక్షల కోట్లు ధనం ప్రజలకు పంచిపెడతాడట. ఈ గణాంకాలకు ప్రామాణికత ఎంత? ఈయన తాను క్రైస్తవ జనుల ప్రతినిధిగా చెప్పుకుంటున్నాడు. అంటే కె.ఏ.పాల్‌ను ‘ఎవరి ఓట్లనో’ చీల్చడం కోసం ఎవరో సృష్టించారని ప్రచారం జరుగుతున్నది. పాల్‌కు ఇంత విదేశీ సంపద ఎక్కడిది?
ప్రస్తుతం జనసేనాని 50 నియోజకవర్గాల్లో తన గెలుపు ఖాయంగా భావిస్తున్నాడు. అందులో 16 నియోజకవర్గాలు లోగడ చిరంజీవి గెలిచినవి. మిగిలినవి 2010లో ద్వితీయ స్థానంలో ఉన్నవి. సహజంగానే 50 సీట్లు జనసేనాని గెలిస్తే అతడు 2019 ఎపి ప్రభుత్వ స్థాపనలో కీలక పాత్ర పోషించగలడు. ఈయనకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మద్దతునివ్వటం విశేషం.
***
కాన్పూరు నుండి కాళిందికి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లో ఫిబ్రవరి 21న ఒక బాంబు పేలింది. దీనిపై నిఘా వర్గాలు పరిశోధన చేయగా త్వరలో జైషే మహమ్మద్ సంస్థ మరిన్ని దాడులకు సిద్ధంగా ఉందని తేలింది. ఎన్నికల సభల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీని హత్యచేయాలని జైషే సంస్థ నిర్ణయించినట్లు తేలింది. లోగడ భీమా-కోరెగాంలో దొరికిన రైనావిల్సన్ టేపులలో కూడా మావోయిస్టులు భారత ప్రధానిని, రక్షణ మంత్రిని, యం. వెంకయ్యనాయుడు, సుష్మా స్వరాజ్, అమిత్‌షా వంటి అగ్ర నాయకులను హత్యచేయాలని నిర్ణయించినట్లు తేలింది. దీనిని యావత్ భారతజాతి ఖండించాలి. కాంగ్రెసు పార్టీ లోగడ ఉగ్రవాదం వల్ల భారీగా నష్టపోయింది. రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ, విద్యాచరణ్ శుక్లా, హయగ్రీవాచారి, డి.శ్రీపాదరావు, ఎలిమినేటి మాధవరెడ్డి, మాగుంట సుబ్బరామిరెడ్డి, పోలీసు అధికారి కోట శ్రీనివాస్, ఇలా ఎందరో కాంగ్రెసు నాయకులు ఉగ్రదాడికి బలి అయిపోయారు. ఐనా ఆ పార్టీ ముస్లిం ఓట్లకోసం పాకిస్తాన్‌కు మద్దతునివ్వటం ఆత్మహత్యా సదృశం. మణిశంకర అయ్యర్ మరో అడుగు ముందుకు వేసి పాకిస్తాన్ వెళ్లి అక్కడి ఐ.ఎస్.ఐ. ఉగ్రవాదులను భారత్‌లోని బి.జె.పి. ప్రభుత్వంపై దాడి చేయవలసిందిగా ప్రత్యక్షంగా కోరటాన్ని ఏమనుకోవాలి? అంతర్గత, సరిహద్దు ఉగ్రవాదాలకు ముగింపు పలికేవరకు కొంతకాలం సార్వత్రిక ఎన్నికలు వాయిదా వేయండి!

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్