రాష్ట్రీయం

జేఈఈ మెయిన్స్ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 5 నుం చి నాలుగు రోజుల పాటు జరగాల్సిన జేఈఈ మెయిన్స్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. అయితే వాయిదా పడిన పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది మార్చి 31న ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం తెలిపింది. ఇదిలాఉండగా ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు సీబీఎస్‌ఈ పేర్కొంది. యూజీసీ నిర్వహించే పరీక్షలు, ఏఐసీటీఈ నిర్వహించే పరీక్షలు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి.