రాష్ట్రీయం

మురళీకృష్ణుడైన యాదాద్రి నృసింహుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో విశేషాలంకార, వాహన సేవల్లో భాగంగా నాల్గవ రోజు శనివారం లక్ష్మీనరసింహుడు మురళీకృష్ణావతారం అలంకార సేవలో హంసవాహనంపై విహరించి భక్తులను తరింపచేశారు.
బాల ఆలయంలో ఉదయం 11గంటలకు ఉగ్రనృసింహుడిని ముగ్ధమనోహారుడైన గోపికాప్రియుడు మురళీకృష్ణుడిగా అలంకరించి ఇష్టపూజలు నిర్వహించి ఊరేగించారు. లోకాలకు భగవద్గీతను అందించి జగద్గురువుగా నిలిచిన నల్లనయ్య రూపంలో లక్ష్మినరసింహుడిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యులయ్యారు. అనంతరం రాత్రి 9గంటలకు స్వామివారి విశేష వాహన సేవలో మృగనరహరి లక్ష్మీనరసింహుడు జ్ఞాన ప్రతీకయైన హంసవాహనంపై విహరించి భక్తులకు ఆధ్యాత్మిక, భక్తి జ్ఞానాదులను అనుగ్రహించి ఆశీర్వదించారు. ప్రధానర్చాకులు నంధీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపుడి నరసింహాచార్యులు, అలంకార సేవకులు ఆత్రేయచార్యులు స్వామివారి విశేషాలంకార, వాహన సేవలు నిర్వహించి భక్తులకు వాటి విశిష్టతలను వివరించారు. సేవోత్సవాల్లో ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తిలు పాల్గొన్నారు. అర్చక పండితులు స్వామివారికి హోమాధి పూజలు, వేద పారాయణాలు నిర్వహించారు.
నేడు వటపత్రాశాయిగా పొన్న వాహనంపై..
యాదాద్రి లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాల్లో స్వామి వారి అలంకార, విశేష వాహనాసేవల్లో భాగంగా నేడు ఆదివారం యాదగిరీశుడికి వటపత్రశాయి అలంకార సేవ, పొన్న వాహన సేవలు నిర్వహించనున్నారు.

*చిత్రం... శ్రీమురళీకృష్ణాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన యాదగిరీశుడు