రాష్ట్రీయం

అమెరికాలో రోడ్డు ప్రమాదం : ముగ్గురు తెలుగువాళ్లు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు వాళ్లు దుర్మరణం చెందారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన దంపతులతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరొకరు
కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతంలోని గాంధీనగర్‌కు చెందిన రాజా గవిని (41), ఆవుల దివ్య (34) దంపతులు. వీరిద్దరూ టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఈ దంపతులు తమ కుమార్తె రియాను డ్యాన్స్ క్లాస్ వద్ద విడిచిపెట్టి వెళ్లారు. తిరిగి వస్తున్న మార్గంలో స్థానికంగా నిర్మాణం చేపట్టిన తమ సొంత ఇంటిని పరిశీలించేందుకు విజయవాడకు చెందిన తమ స్నేహితుడు ప్రేమ్‌నాథ్ రామనాథం (42)ను కూడా తీసుకెళ్లారు. వీరు ముగ్గురు ప్రయాణిస్తున్న కారు ఎఫ్‌ఎం 423 ఇంటర్‌సెక్షన్ వద్దకు రాగానే వేగంగా వచ్చిన భారీ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ఈ మేరకు అమెరికా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

*అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన హైదరాబాద్ గాంధీనగర్‌కు చెందిన
దంపతులు రాజా, దివ్య (ఫైల్)