రంగారెడ్డి

వార్డుల సమస్యలు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, ఫిబ్రవరి 24: పట్టణ ప్రగతిలో వార్డులవారీగా సమస్యలు పరిష్కరించుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. సోమవారం దమ్మాయిగూడ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మేడ్చల్ కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. అహ్మద్‌గూడలోని నాల్గువ వార్డులో స్వచ్ఛ ఆటోలు, రెండు ఎకరాల్లో సమీకృత మార్కెట్ నిర్మాణానికి, సీసీ కెమెరాలను హరిదాస్‌పల్లిలోని ఎనిమిది ఎకరాల్లో నిర్మించనున్న పార్కుకు, రెండు కోట్ల నిధులతో రోడ్ల మరమ్మతుల కోసం చేపట్టనున్న పనులకు మంత్రి మల్లారెడ్డి ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ జాన్ శ్యామ్‌సన్, జడ్పీ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, మున్సిపల్ చైర్మన్ ప్రణీత, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కమిషనర్ రామలింగం, వార్డు కౌన్సిలర్ వెంకటేశ్ పాల్గొన్నారు.