రంగారెడ్డి

సీఎం కేసీఆర్ పుట్టిన రోజు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, ఫిబ్రవరి 16: అహర్నిషలు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పరితపించే సీఎం కేసీఆర్ పుట్టిన రోజున ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి జన్మదిన శుభాకాంక్షలు తెలపాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఆదివారం ఆర్కేపురం డివిజన్ వాసవి కాలనీలోని వాసవి ఆధ్యాత్మిక కేంద్రంలో డివిజన్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్ శర్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కాలనీల ఆత్మీయ సమ్మేళన సమావేశానికి మంత్రి సబితా రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వసతులు కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు. పుట్‌పాత్‌లపై వ్యాపారం చేసుకునే చిరువ్యాపారులకు తగిన ఏర్పాటు చేస్తామని అన్నారు. కాలనీల్లో ఓపెన్ జిమ్ముల ఏర్పాటు చేయిస్తానని చెప్పారు. అల్కాపురి కాలనీలో సీనియర్ సిటిజన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ వీరమల్ల రాంనర్సింహ గౌడ్, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, డీసీ కృష్ణయ్య, ఈఈ నరేందర్ గౌడ్, చైతన్యపూరి సీఐ జానకి రెడ్డి, డివిజన్ జే ఏ సీ కన్వీనర్ చంద్రశేఖర్ గుప్త, సెక్రెటరీ మహేందర్, మోర్ కృష్ణారెడ్డి, హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బీరెల్లి వెంకట్ రెడ్డి, ఖిలా మైసమ్మ టెంపుల్ చైర్మన్ గొడుగు శ్రీనువాస్, సాజిద్, శ్రీనువాస్ రెడ్డి పాల్గొన్నారు.