రంగారెడ్డి
గిర్మాపూర్ మల్లన్న జాతరను విజయవంతం చేయాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 16 December 2019
మేడ్చల్, డిసెంబర్ 15: గిర్మాపూర్ మల్లన్న జాతరను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ కోరింది. ఆదివారం గిర్మాపూర్ గుట్టల్లో గల మల్లన్న గుడి వద్ద జాతర ఏర్పాట్లపై ఆలయ కమిటీ అధ్యక్షుడు వంగేటి పద్మారెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ప్రతీ ఏడాది మొదటి ఆదివారం గిర్మాపూర్ గుట్టల్లో గల మల్లన్న స్వామి జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈసారి కూడా జాతరను భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా దిగ్విజయంగా నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. ఆలయం వద్ద పరిసర ప్రాంతాల్లో విద్యుత్ దీపాల ఏర్పాటుతో పాటు ఆలయానికి రంగులు వేయాలని నిర్ణయించారు.