రంగారెడ్డి

కార్మికుల కష్టాలు పట్టవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, నవంబర్ 18: ఆర్టీసీ కార్మికుల ఆందోళన 45వ రోజుకు చేరింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఇతర న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు చెంగిచర్ల, ఉప్పల్ బస్‌డిపో కార్మికులు రిలే నిరహార దీక్షలు చేపట్టారు. సోమవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చెంగిచర్ల డిపో వద్ద రిలేనిరహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. కార్మికులను విస్మరిస్తే రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఒక కార్మికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.