రంగారెడ్డి
ప్రతి ఒక్కరిలో భక్తి భావం పెరగాలి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 November 2019
కులకచర్ల, నవంబర్ 17: హోమాలు చేయడంద్వారా ప్రకృతి శాంతిస్తుందని ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందని పలువురు వెల్లడించారు. ఆదివారం కులకచర్ల మండలం పాంబండ దేవాలయ ప్రాంగాణంలో నిర్వహించిన రుద్రహోమం నిర్వహించారు. ఈ హోమంలో భక్తులతో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున హజరైనారు. కులకచర్ల మండల కేంద్రంలో భక్తి పాటలు వినిపిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాంబండపై హోమం నిర్వహించారు. ప్రతి ఒక్కరిలో భక్తి భావం పెరగాలని కార్యక్రమానికి హజరైన వారు సూచించారు. కార్యక్రమంలో నిర్వాహకుడు హరిసింగ్, డీసీ ఎంఎస్ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గణాపురం వెంకటయ్య గౌడ్, కాంగ్రెస్ మండలశాఖ అధ్యక్షుడు శేరి రాంరెడ్డి పాల్గొన్నారు.