రంగారెడ్డి

డాక్టర్ ఏలూరికి ఉత్తమ బిజినెస్ లీడర్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి/కేపీహెచ్‌బీ కాలనీ, సెప్టెంబర్ 17: ఫార్మా రంగంలో విశేష సేవలందించిన ఎస్‌ఆర్‌సీ ల్యాబ్స్ అధినేత డాక్టర్ ఏలూరి రామచంద్రా రెడ్డికి ఉత్తమ బిజినెస్ లీడర్ అవార్డు దక్కింది. ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ అయిన నయూఆర్‌ఎస్ ఏషియా వన్ నాల్గోవ ఎడిషన్‌లోని ఇండియాస్ గ్రేటెస్ట్ బ్రాండ్స్ అండ్ లీడర్స్ అవార్డు ప్రదానోత్సవం దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని తాజ్ హోటల్‌లో జరిగింది. కార్యక్రమానికి కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలె ముఖ్య అతిథిగా హాజరు కాగా మహారాష్ట్ర మంత్రులు, 12 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఎస్‌ఆర్‌సీ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏలూరి రామచంద్రా రెడ్డికి ఉత్తమ బిజినెస్ లీడర్ అవార్డును మలేషియా కాన్సుల్ జనరల్ జయినాల్ అజ్లన్ నాడీజిర్, ఇటలీ కాన్సుల్ జనరల్ స్ట్ఫోనియా కోస్తాంజాలు ప్రదానం చేశారు. డా.రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఆర్‌సీ ల్యాబొరేటరీస్ దశాబ్దకాలంగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో అగ్రగామిగా కొనసాగుతోందని, తక్కువ ఖర్చుతో క్యాన్సర్ నివారణ మందును అందించాలన్న ధృడ సంకల్పంతో కృషి చేస్తున్నామని చెప్పారు. గత కొనే్నళ్లుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటూ అంతర్జాతీయ అవార్డు పొందడం గర్వంగా ఉందని డాక్టర్ ఏలూరి తెలిపారు. ఫార్మా రంగం అధివృద్ధికి కృషి చేయాలని కేంద్ర మంత్రికి విన్నవించగా సానుకూలంగా స్పందించి ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారని డాక్టర్ ఏలూరి పేర్కొన్నారు.

తాండూరు వాసికి విశిష్ట పురస్కారం
తాండూరు, సెప్టెంబర్ 17: ఆరోగ్య బీమా రంగంలో సేవలకు ఫేమ్ క్లబ్ ఇంటర్నేషనల్ పురస్కారాన్ని తాండూరు వాసి రాజ్‌కుమార్ అందించారు. పురస్కారానికి తెలుగు రాష్ట్రాల ఉంచి రాజ్‌కుమార్ ఎంపికయ్యారు. ఈనెల 16న ఇటలీలో జరిగిన కార్యకమ్రంలో పురస్కారాన్ని అందుకున్నాడు.