రంగారెడ్డి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీకాలనీ, జూలై 20: ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలని కేపీహెచ్‌బీకాలనీ డివిజన్ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు మందలపు సాయిబాబా చౌదరి అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని సర్ధార్ పటేల్‌నగర్ కాలనీలో చైతన్య టోక్నొ స్కూల్‌లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు.కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు ఎజీ ఎం.శివరామకృష్ణ, ప్రిన్సిపాల్ సునీల్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్‌శాస్ర్తి, ప్రతాప్‌కుమార్, అప్పారావు, రత్నాకర్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంలో మహాంకాళీ బోనాలు నేడు
ఇబ్రహీంపట్నం, జూలై 20: ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో నేడు మహాంకాళీ అమ్మవారి బోనాల ఉత్సవాలను నిర్వహించనున్నారు. మంచాల రోడ్డు సమీపంలోని మహాంకాళీ అమ్మవారి దేవాలయాన్ని ఆలయ కమిటీ సభ్యులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయానికి రంగులద్ది, విద్యుత్ దీపాలు, మామిడి తోరణాలతో సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.