తెలంగాణ

జెఎసి అంతం తెరాస లక్ష్యం: రేవంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో జెఎసిని అంతం చేయడమే తెరాస లక్ష్యంగా కనిపిస్తోందని టిటిడిపి నేత రేవంత్‌రెడ్డి మంగళవారం మీడియాతో చెప్పారు. రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేయడంతో తెలంగాణ మంత్రులు చిత్తకార్తె కుక్కల్లా ఆయనపై దాడి చేస్తున్నారని విమర్శించారు. రైతు సమస్యలు, కరవు వంటి విషయాలపై కోదండరామ్ యాత్రలు చేశాకే కెసిఆర్ ప్రభుత్వం నష్టనివారణ చర్యలు ప్రారంభించిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో లేని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి వంటి వారు సైతం కోదండరామ్‌ను విమర్శిస్తున్నారంటే అది కేవలం కెసిఆర్ మెప్పు కోసమేనని రేవంత్ అన్నారు. ఉద్యమ సమయంలో కోదండరామ్‌ను వాడుకున్నవారు ఇపుడు ఆయనపై దాడి చేయడం సరికాదన్నారు. విపక్షాల చేతిలో కోదండరామ్ కీలుబొమ్మ అని మంత్రులు అనడం తగదన్నారు.