జాతీయ వార్తలు

ప్రజా గళాన్ని నొక్కేస్తున్నారు:ప్రియాంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలపై కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ స్పందించారు. బీజేపీ ప్రభుత్వం తన ఉనికిని కాపాడుకునేందుకు పౌరులు, పాత్రికేయులు, విద్యార్థుల గళాన్ని నొక్కేస్తుందని కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ అన్నారు. ఆమె ఈ మేరకు ట్వీట్ చేశారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజల గొంతు నొక్కెస్తుందని విమర్శించారు. ప్రజాగళాన్ని వినేందుకు ప్రభుత్వం భయపడుతుందని, కాని యువత కేంద్రం అణగదొక్కే చర్యలను ఎదుర్కొంటుందని అన్నారు. వీరి గొంతు వినాల్సిందేనని ఆమె ట్వీట్ చేశారు.
కాగా పౌరసత్వ ఆందోళనలు ఆదివారంనాడు దేశ రాజధాని ఢిల్లీని అట్టుడుకించాయి. ఇప్పటివరకు ఈశాన్యానికే పరిమితమైన ప్రదర్శనలు, ధర్నాలు రాజధానిని తాకాయి. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో అనేక మంది గాయపడ్డారు. నాలుగు బస్సులను ఆందోళనకారులు దగ్ధం చేశారు. మరోపక్క ఈశాన్య భారతంలో నివురుగప్పిన నిప్పులాంటి పరిస్థితి.