ఆంధ్రప్రదేశ్‌

ప్రజావేదిక భవనం కూల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి: నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మించారంటూ సీఎం ఆదేశాల మేరకు ప్రజావేదిక భవనం కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. మంగళవారం అర్థరాత్రి నుంచి కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయానికి 70శాతం కూల్చివేత పనులు పూర్తయ్యాయి. కరకట్టను తమ ఆధీనంలోకి తీసుకున్న అధికారులు, పోలీసులు కూల్చివేత పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రజావేదిక సామాగ్రిని ఇతర ప్రాంతాలకు లారీల్లో తరలించారు. కూల్చివేత సమయంలో అక్కడకు చేరుకున్న రైతుల, టీడీపీ కార్యకర్తలను వెనక్కి పంపించారు.