AADIVAVRAM - Others

ఉండేదే రాముడొక్కడే ఊరకచెడిపోకె మనసా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మజోస్యులు సుబ్రహ్మణ్యగారి సీతానగరం సత్యాగ్రహాశ్రమం లో మహాత్మాగాంధీ ఒకటో, రెండో రోజులు బసచేశాడు. ఆశ్రమ కార్యకలాపాలను , నిర్వహణ పద్ధతులను ఆయన ఎంతో మెచ్చుకున్నట్టు సుబ్రహ్మణ్యంగారిని గూర్చి రాసిన వారు అక్షరీకరించారు.
అక్కడాయన బసచేసినపుడు దీనిని విశ్రాంతి అనరాదు. నిరంతర నిర్వరామ ప్రబోధ కార్యక్రమ రూప కల్పన దక్షుడాయన. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ అప్పటికి చిన్నపిల్ల. అంతే ఆమెకు ఏ పధ్నాలుగు పదిహేనోళ్లో ఉండవచ్చు. గాంధీజీకి త్యాగరాజు కర్తీనలు వినిపించేదట. ఆయన చాలా ఆనందపడేవాడని సేత సీతాదేవి అనే సాహితీ పరురాలుతాను రాసిన సమగ్ర దుర్గాబాయ్ దేశముఖ్ జీవిత చరితలో ఉటంకించింది. అంటే ఏమిటని ప్రాథమిక విద్య ఇంగ్లీషులో ఆపోసనం పట్టిన శైశవబాలబాలికలు అడుగుతారేమో)
తుమ్మల సీతారామమూర్తి చౌదరి గౌరి గూర్చి మనకందరికీ తెలుసుకదా. ఆయన మహానుభావుడు. తనను తెలుగు లెంక అని అభివర్ణించుకునేవాడు. బసవేశ్వరుడు పరమ శివుడికి తాను వెంకనని ఉప్పొంగిపోయినట్లు సీతారామమూర్తిగారి మేనల్లుడు నాగళ్ల గురుప్రసాద రాయ్ మహాశయులు ఒకనాడు ఒక చోద్యంప్రసక్తం చేశారు. చౌదరిగారి మనవడో లేదా తత్తుల్యుడో ఒక బాలుడు తాతా ఒడలిక అంటే ఏమని అర్థం అడిగితే తుమ్మల వారు ఖిన్నులైనారట. ఆయన తెలుగు లెంక కదా! తన వంశమే మైలపడినట్లు బాధపడి ఉంటారు. పాపం! ఆ పిల్లవాడిని తప్పుపట్టకూడదు. ఆ కుర్రకు ప్రాథమిక లేదా మాధ్యమిక పాఠశాలలో విద్యగరచేబాలబాలికలకు తెలుగు పట్ల అభిరుచి కలిగించేటట్లు బోధించారో లేదో! పోనీ! అంత చిన్న వయసున బడలిక, ప్రాలు మాలిక అనే తెలుగు పదాల అర్థం తెలియకపోవడం నేరం కాదు. కానీ నానాటికి తీసికట్టు నాగంబొట్లూ చందమైంది తెలుగు పోను పోను పల్లెటూళ్ల వీధి బళ్లలోనే కదా అని భేదం కలుగుతుంది.
అమెరికాలోనైతే ప్రాథమిక విద్యాభ్యాసన తరగతుల నుంచే శిశుమనోహ్లాద కర సృజన సామర్థ్య ప్రేరక ఆసక్తికర చిన్న చిన్న పుస్తకాలు నిర్ణీత నియత అదనపు పఠనీయాలుగా చదివిస్తారు. ఇటువంటి బుజ్జి బుజ్జి పుస్తకాలు నాలుగైదు వేల సంఖ్యలో ఇంకా ఎక్కువైనా ఉండవచ్చు. చదివిస్తారు. 5 నుంచి 12 తరగతులు విద్యార్థుల చేత కథలు తమ అనుభవాలు , సభ్యసమాజం లో పౌరుడి విధులు, బాధ్యతలు ఆలోచింపచేసి వాళ్లచేత రాతలో ఉండేట్లు చేస్తారు.
ఇక మన దేశంలో అటువంటి బాలసాహిత్యం శిశుమనోనిగ్రహణ, ధారణ సామర్థ్యం పెంపొందించే పుస్తకాలు పూజ్యం అంటే లేవు అనిఅర్థం. బాల బాలికలను ఉత్తమ పౌరసత్వానికి తర్ఫీదు చేయటం ఎట్లా?
ఇప్పుడు అయోధ్యలో రామాలయం నిర్మించే సమస్య పరిష్కారం అయింది కదా. పదేళ్ల వయసునుంచి ఇరవై ఏళ్లవయసు తెలుగు పాఠకులు ఈవిషయమై తమకు ఏమర్థమైంది తేటతెల్లమయ్యేటట్లు చెప్పగలరా?
సుప్రీంకోర్టు అసంధిగ్థ తుదిదీర్పు ను గూర్చి మనదేశంలో స్వయం ప్రకటిత మేధావులు, తమ నిరపేక్ష దీక్షాదక్షులు రకరకాలైన వ్యాఖ్యానాలు, విశే్లషణలు, దేశ నిరోధక జాతికి ప్రశంసాత్మకంగా ఉటంకింపులు ఇప్పటికి తీర్పు వెలుపడి ఇరవై రోజులవుతున్నాయి. తమ ఉక్రోషం వెళ్ల గక్కుతూనే ఉన్నారు. ముస్లిములకు చాలా అన్యాయం జరిగిందని వాపోతున్నారు. ఇక ది హిందూ లాంటి జాతీయ దినపత్రిక లుమరి ఇలాంటి వివాదాలకు ఏమాత్రం తావులేకుండా సిందువులకు అతి పవిత్రమైన ఇతర పుణ్యక్షేత్రాల గురించి రచ్చ చేయటానికి వీలు లేకుండా ఈ తీర్పు బల్లగుద్ది ఐదుగురు ఏక కంఠ్యులై చెప్పినట్లు చెక్కి లితో నాలుక నొక్కి (టంగ్ ఇన్ ది చీక్ ) సంతృప్తి చెంగుతున్నారు. 1991 లో అటువంటి తీర్పు వెలువడిందట. అది అనుల్లంఘనీయం అయిన తీర్పు అట. ఇంతటితో ఇటువంటివి సమసిపోయినట్లే అని హర్షాతిరేక ప్రకటనలు గుప్పిస్తున్నారు.
ఆశ్చర్యకర విషయం. బాబరు చక్రవర్తి అట . తొలి మొగల్ చక్రవర్తి అటు బాబర్ ఈ దేశంలో ప్రధానంగా ఉత్తర హిందుస్థాన్ లో ఆ వైపు ఈవైపు దండయాత్రలకు వెళ్లింది నాలుగు సంవత్సరాల కాలమే దక్షిణ హిందూ స్థానం వైపు చూపు ప్రసరించలేదు. మరి అతడుచక్రవర్తి ఎట్లా అవుతాడు? అతడి సేనాని మీర్ బక్ష అయోధ్య అంతకు పూర్వం అక్కడ విరాజిల్లుతున్న భవ్యాతిభవ్య శ్రీరామాలయం కూల గొట్టకుండానే సాప్సగా చదునుగా ఉన్న భూమిపై మసీదు నిర్మించాడట. కూలగొట్డాడనటానికి సాక్ష్యాలు ఇదమిత్థంగా చూడలేము. అని సుప్రీంకోర్టు అనలేదా? అని మార్కిస్టులు అన్నారు. నిజమే అక్కడి విజన భూమిపై బాబరు సేనాని ముగ్గుమ్మట మసీదు నిర్మించాడనే వాదం కోసం కాసేపు అంగీకరించినా అంత పెద్ద మసీదు కట్టడానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?సిందువులు తమ ప్రాణాలు పోయినా సహకరించరు కదా. బాబరే దండయాత్ర సంస్ధిడై ఉండి పోనీ, ఆయన సైనికలు మసీదు నిర్మాణంలో పాల్కొన్నారనటానికి వీలులేదే? అతణ్ణి చక్రవర్తిఅని చొంగ కార్చుకోవటానికి అవకాశం ఎక్కడిది? సమర్ ఖండ్ నుంచి వచ్చాడు. చిల్లర మల్లర యుద్ధాలలో కొంత భాగం దురాక్రమణ చేసి ఉండవచ్చు. నాలుగేళ్లు అయోధ్యలో శ్రీరాముడి ఆలయం కూలగొట్టకుండా లేదా అపూనాదులు స్తంభాలు యతాతథంగా మసీదు కరించకుండా ఉండటం ఎలా సంభవం? సున్నీ వక్ఫ్ బోర్డు తరఫు లాయర్ రాజీ వేధవన్ గారు సిందువులు ఎన్నో దండయాథ్రలు చేశారు. తమ తోటి రాజ్యాలతో ముస్లిములు దండ యాత్రలు చేస్తే దోషమేమిటి అని‘లా’ పాయింట్ లాగాడు. అది తెగిందనుకోండి. నిజమే చిన్న చిన్న హిందూ రాజ్యాలు పరస్పర కలహశీలురై అవివేకులై ఇరుగుపొరుగు రాజ్యాలపై కదనభేరి ప్రయోగించిన విషయం వాస్తవమే. కానీ గుళ్లను, గోపురాలను వారు విధ్వంసం చేయలేదే? ఆ మాత్రం ఇంగితం కూడా లేకపోయింది. ముస్లిముల సంస్కృతిని మత విశ్వాస దీక్షను వేనోళ్ల కొనియాడిన రాజీవ్ ధవన్ కు ఇక గాంధీ మహాత్ముడి ముని మనవడైన తుషిర్ గాంధీగారు కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఇంత అన్యాయమా అని. మహాత్మాగాంధీ గారే జీవించి ఉన్నట్లైతే ఎట్లా ఉండేదో అని లబలబ త్వం వెలిబుచ్చిరు. నిజమే గాంధీ ఓ స్పందన, ప్రతిస్పందన ఎట్లా ఉండేదో? సందేహాస్పదంగానే ఉండేదేమో . మన సోదరులు ఇస్లామీయులు రామ రామ వారిని నొప్పించకూడదు అనేవారేమో. రాముడు ఎక్కడ లేడు కనుక? అక్కడొక్కచోటే ఉన్నాడా? అనేవారమో! అయోధ్య , మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతికా, పురీ ద్వారవతీ , చైవససె్తైతే మోక్షదాయకా! అని అన్నట్లు కురాన్ లో గాని అరబిక్ , పర్షియన్ లలో గాని అయోధ్య మసీదు మాకు గయా ప్రయాగ కాశీల వంటిది అని ఉండేదేమో చూపగలరా ముస్లిములు? సమర సభావం , సహృదయత, సౌదర్యం లేకపోగా ముస్లిముల కన్నా గింజుకుంటున్నారు. మన కుహనా మార్క్సిస్టులు. సెక్యులర్ రూక్ష , దిదృక్షులు, ఇన్నాళ్లకు ఉండేదా రామడొకడు.... త్యాగరాజ స్వామి అనే దివ్య సంగీత ఋషి వాక్కు ఫలించింది కదా. అదే చాలు వేనవేలు కృతజ్ఞతలు సుప్రీంకోర్టుకు.

-అక్కిరాజు ఉమాపతిరావు