వినమరుగైన

నియమాల తోరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు కురిసే శీతాకాలం ప్రారంభమయిందంటే స్వామియే శరణం అయ్యప్పా అని భక్తాగ్రేసరుల భజనలు పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రతిధ్వనిస్తాయి. గతంలో పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఈ దీక్షలు, నేడు మారుమూల గ్రామాలకు సైతం విస్తరించి, భక్తజనం నానాటికీ పెరుగుతున్నది. కార్తీక మాసం ప్రారంభం నుండి వివిధ సమయాలలో ఆచరించే అయ్యప్ప స్వామి దీక్షలు భక్తిశ్రద్దలకు, పవిత్రతకు, నియమాలకు ప్రతీకలు.
అయ్యప్ప అవతారము
ప్రతి యుగంలోనూ ధర్మసంస్థాపనార్థం శ్రీమహావిష్ణువు అవతారాలెత్తుతూ సనాతన ధర్మాన్ని సంరక్షిస్తాడు. కాని దత్తాత్రేయుడు భక్తజనోద్దరణ కొరకు శాశ్వత అవతార పురుషుడుగా భూమి యందు అవతారాలు ఎత్తుతూ ‘చతుర్యుగ అవతార మూర్తి’గా ఖ్యాతినొందాడు. త్రిమూర్తుల అంశాలుగా జన్మించిన దత్తాత్రేయుని అవతారాల్లో ఒకటి అయ్యప్పస్వామి. మోహిని రూపంలో ఉన్న హరికి, శివునికీ కలిగిన పుత్రుడైనందున ‘హరిహర సుతుడని’ ధర్మశాస్తా, భూతనాధుడు, అయ్యప్ప అని కీర్తించ బడుతున్నాడు. మహావిష్ణువుచే మణిహారమును మెడలో వేయబడినందున ‘మణికంఠుడని’ సార్థక నామధేయుడైనాడు. పాండ్య రాజైన రాజశేఖరుడు, మహారాణి పేరిందేవి, ప్రేమతో ‘అయ్య, అప్ప’ అని పిలిచినందున ‘అయ్యప్ప’గా పిలువబడుతున్నాడు. రాజశేఖర మహారాజు ‘అగస్త్య మహాముని’ ఆదేశానుసారం ‘ఎరుమేలి’ వద్ద ధర్మశాస్తా దేవాలయంను నిర్మించెను. శబరి తపస్సు చేసిన స్థలంలో విశ్వకర్మ అయ్యప్ప దేవాలయమును, ఎడమ వైపు మాలికాపురత్తమ్మ ఆలయాన్ని, అయ్యప్ప ఆలయానికి తూర్పున 18 మెట్లు, వాటికిరువైపుల కరుప్ప, కడుత్త దేవాలయాలు నిర్మించెను. పవిత్రమైన మకర సంక్రాంతి రోజు శనివారం కృష్ణ పంచమి, ఉత్తరా నక్షత్రాన పరుశురాముడు అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించెను.
మాల ధారణం
18 సార్లు శబరిమల పదునెట్టాంబడిని అధిరోహించి, దైవ సాక్షాత్కారం కలిగిన గురుస్వామి మంత్రోచ్ఛారణలతో మాలధారణ చేస్తాడు. దీక్షా నియమాలు త్రికరణ శుద్ధిగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేయిస్తాడు. ఏకాగ్రతతో ఆత్మసాక్షాత్కారార్ధమై, పాపములు తొలుగుటకు, లౌకిక విషయాలపై వ్యామోహం తగ్గుటకు, కోపతాపాలు ఉపశమించేందుకు ఉదయం, సాయంత్రం 108 సార్లు శరణు ఘోష చేస్తూ, 41 రోజులకు తక్కువ కాకుండా దేవుడిని పూజిస్తూ సాధన చేయడం సాంప్రదాయం. నల్ల దుస్తులు ధరించుట, నుదుటిపై విభూతి, చందన, కుంకుమలు ధరించుట, తులసి, రుద్రాక్షమాల ధారణం, బ్రహ్మచర్యం, సాత్వికాహారం, భజన, అన్నదానం, పవిత్ర స్నానాలు, వైరాగ్య సంకేతాలైన గడ్డం, గోళ్లు పెంచుట దీక్షలో ప్రధానాంశాలు. కొబ్బరికాయ మూడు కన్నులలో ఒక కన్నుకు రంధ్రం చేసి, నీటిని తొలిగించి పరిశుద్ధమైన నెయ్యితో నింపి, ఇరుముడిలో ఒక ముడిలో కడుతూ, రెండవ ముడిలో యాత్రకు కావలిసిన ఆహార పదార్థాలు కడతారు. ఇరుముడిని తలపైకి ఎత్తుకున్నాక వెనక్కు తిరిగి చూడక బయలుదేరుతారు. ప్రయాణంలో ఎరుమేలి, కాళికట్టి, అళుదానది, కలిడంకుండ్రం, కరిమల, పంపానది, నీలిమలై, శరంగుత్తియాల్, శబరిపీఠం, సన్నిదానం చేరుకుంటారు.
41 రోజులకు తక్కువ గాకుండా గురుస్వామి ద్వారా 108 పూసలు గల తులసి లేదా రుద్రాక్షమాలధారణ, ఉదయం, సాయంత్రం చన్నీటి స్నానం, విభూతి, చందనం, కుంకుమ ధరించి 108 సార్లు అయ్యప్ప శరణు ఘోష పలకడం, కర్పూర హారతి, ఫలాదిక సమర్పణం, నలుపు దుస్తులు ధరించడం, రోజుకొక్కసారైన దేవాలయ సందర్శనం చేస్తారు. ఇవే కాకుండా..
పాదరక్షలు తొడగక పోవడం, ధూమపానం, మత్తు పదార్థాలు, తాంబూలం, మాంసాహార నిషేధం, ఒక్కసారి భోజనం, అల్పాహారం, క్షవరం, గోళ్ళు తీయడం నిషేధం. మంచంపైగాక చాపపై మాత్రమే నిద్రించడం, పగలు నిద్రించకపోవడం, దీక్షాకాలంలో బ్రహ్మచర్యం పాటించడం, వినోద కార్యక్రమాలు చూడక పోవడం, స్నానం చేసేవరకు మంచినీరు త్రాగకపోవడం, కుల మత ధనికపేద భేదం లేక అయ్యప్పలకు నమస్కారం చేయడం, ఆధ్యాత్మిక పుస్తక పఠనం, సత్సంగం, విధిగా భజనలో పాల్గొనడం, కనీసం మూడుసార్లయినా ఇతరుల యింటికి భిక్షకు వెళ్ళడం, అన్నదానం చేయడం అయ్యప్ప దీక్షా సమయంలో విధిగా పాటించాల్సిన నియమాలు.
మొదటిసారి దీక్షను తీసుకున్న కనె్నస్వాములు మకర సంక్రాంతి సమయంలో కనిపించే మకర జ్యోతిని సందర్శించుకుంటారు. చాలా వరకు స్వయంపాకానే్న భుజిస్తూ ఒకపూట భోజనం, ఒకపూట అల్పాహారం మితంగా భుజిస్తూ, దీక్షను స్వీకరించేవారు దైవభక్తి, ఆత్మ సంయమనంతో పాటు, ఆరోగ్యవంతులుగా ఉండగలరనేది నిర్వివాదాంశం.

- సంగనభట్ల రామకిష్టయ్య