Others

బహుళ ప్రయోజన విద్య ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ నూతన విద్యావిధానంపై కస్తూరి రంగన్ కమిటీ చేసిన ప్రతిపాదనల్లో కీలకమైన వాటిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది. కమిటీ చేసిన సిఫార్సుల్లో ‘అన్నిరకాల కోర్సులు, వృత్తి విద్యతోపాటు ఒకేచోట వుండాలన్న’ది ఆచరణీయం, ఆమోదయోగ్యమైనది. ఒకే తరహా కోర్సులను అందించే మూస విధానానికి కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఇకనైనా స్వస్తి పలికి బహుళ ప్రయోజన కోర్సులను అందించే వ్యవస్థలుగా మార్పుచెందితే విద్యార్థులకు ప్రయోజనకరంగా వుంటుందని కమిటీలోని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తపరచడం స్వాగతించదగింది. ప్రస్తుతం వైద్య, న్యాయ, వ్యవసాయ, సాంకేతిక విద్యలను అందించడానికి ఒక్కొక్క కోర్సుకు ఒక్కొక్క విద్యాలయం వుండడంతో విద్యార్థులు ఒకే కోర్సుతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
పాశ్చాత్య దేశాలలో అయితే ఒక కళాశాల లేక విశ్వవిద్యాలయంలో బహుళ కోర్సులు అందించడం ద్వారా విద్యార్థులు రెండు, మూడు కోర్సులు చదువుతూ ఒకేచోట పరిశోధన చేయడానికి, వారి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. కాని మన దేశంలో ప్రభుత్వాలకు ముందుచూపు లేకపోవడం, విద్యార్థులలో అవగాహనా రాహిత్యం, మూస విద్యావిధానంతో బహుళ కోర్సులు అందించే కళాశాలలు, విశ్వవిద్యాలయాలు లేకపోవడం విచారకరం. విద్యార్థులు ఒకే కోర్సుకు పరిమితమవుతుండడంతో ప్రపంచస్థాయి నిపుణులతో పోలిస్తే బహుళ నైపుణ్య సాధనలో మన విద్యార్థుల్లో వెనుకబాటుతనం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. మన దేశంలోని రమారమి 800 విశ్వవిద్యాలయాలు, 40వేల కళాశాలలను కలిపి 15వేల నాణ్యమైన, బహుళ కోర్సులు అందించే విద్యాసంస్థలుగా మార్చుకోవాలని కమిటీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే 20 శాతం కళాశాలలు వంద మంది కంటే తక్కువ విద్యార్థులతో, అరకొర సౌకర్యాలతో వనరులు లేక నాణ్యమైన విద్య అందించలేని నకిలీ విద్యాసంస్థలు కనుమరుగు అవక తప్పదు.
ప్రస్తుతం ఒక్కొక్క కోర్సుకు ఒక నియంత్రణ సంస్థ వుండడంతో ప్రతి సంస్థకు నియమ నిబంధనలు, విధానాలు వేరుగా వుండడంతో విద్యా సంస్థల మధ్య ఏకాభిప్రాయం వుండడం లేదు. మన దేశంలోనూ ఒకే నియంత్రణ సంస్థ వుండి బహుళ కోర్సులతో కూడిన విద్యాసంస్థలు వుంటే మంచిదన్న కమిటీ సిఫార్సు అమలులోకివస్తే విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్యమైన విద్యను అందించవచ్చు. ఇప్పటికే ఖరగ్‌పూర్ ఐఐటీలో ఇంజినీరింగ్‌తోపాటు వైద్య విద్యను ప్రారంభించడం శుభ సంకేతం. పరిశోధనా విశ్వవిద్యాలయాలు ఒక వర్గీకరణగా, బోధనా విద్యాలయాలు రెండవ వర్గీకరణగా, బోధనా కళాశాలలు మూడవ వర్గంగా విభజించి వర్సిటీలలో విద్యార్థుల సంఖ్యను 5నుండి 25వేల వరకు, కళాశాలల్లో డిగ్రీ కోర్సులపై దృష్టిపెట్టి స్వయం ప్రతిపత్తి హోదా పొందాల్సి వుంటుందని ఈ కమిటీ ప్రతిపాదనను ప్రభుత్వానికి చేసింది. అనుబంధ కళాశాలలను తీసేసి వర్సిటీలు, డిగ్రీ పట్టాలు ఇచ్చే కళాశాలలే వుండాలని 2020 సంవత్సరం తర్వాత ఇక మరి ఏ కళాశాలలకు అనుమతినివ్వకుండా నాణ్యమైన విద్యను అందించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఇంటర్ విద్యతోపాటు నాలుగేళ్ళ ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు ప్రవేశపెట్టాలని, అనువాద సమస్య రాకుండా ఉన్నతమైన న్యాయ విద్యను రెండు భాషలలో అందించాలని, ఎంఫిల్ కోర్సును రద్దుచేయాలని ఈ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఎంతవరకు అమలుచేస్తుందో వేచి చూడాల్సిందే.

-సి.కనకదుర్గ, హైదరాబాద్