Others

‘వ్యాసదర్శనము’ గ్రంథావిష్కరణ 9న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచార్య శిప్రముని పీఠం (వేదవిజ్ఞాన ప్రచార పరిశోధనాసంస్థ) వ్యవస్థాపక అధ్యక్షులు ముదిగొండ శివప్రసాద్ రచించిన ‘వ్యాసదర్శనము’ గ్రంథావిష్కరణ కార్యక్రమం ఈ నెల 9న చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో జరుగుతుందని గ్రంథ రచయత ఒక ప్రకటనలో తెలిపారు. ఆచార్య శిప్రముని పీఠం, త్యాగరాయ గానసభ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త సుధామ అధ్యక్షత వహిస్తారు. ముఖ్య అతిథిగా దూరదర్శన్ మాజీ సంచాలకులు డా. ఓలేటి పార్వతీశం విచ్చేస్తారు. ప్రముఖ సాంస్కృతికవేత్త వైఎస్‌ఆర్ మూర్తికి ఈ గ్రంథం అంకితం చేయబడుతుంది. త్యాగరాయ గానసభ అధ్యక్షులు కళా జనార్దనమూర్తి జ్యోతి ప్రజ్వలన చేస్తారు. మహాభారత నిఘంటు నిర్మాత త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యం పండితులు ఆశీః ప్రసంగం చేస్తారు.