Others
‘నడిచే దారిలో..’ ఆవిష్కరణ 16న
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 10 June 2018
కవిసంధ్య, స్ఫూర్తి సాహితీ సంయుక్త నిర్వహణలో సురేంద్ర దేవ్ చెల్లి కవితా సంపుటి ‘నడిచే దారిలో...’ ఆవిష్కరణ జూన్ 16వ తేదీ సాయంత్రం 6 గంటలకు యానాం, అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్లో జరుగుతుందని కవిసంధ్య సాహితీ సాంస్కృతిక సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కవిసంధ్య సంపాదకులు డా. శిఖామణి అధ్యక్షతన జరిగే సభలో పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై గ్రంథాన్ని ఆవిష్కరిస్తారు. గౌరవ అతిథులుగా దవులూరి సుబ్రమణ్యేశ్వరరావు, జి.లక్ష్మీ నరసయ్య, ఆర్.సీతారాం, ప్రసాదమూర్తి, యాకూబ్, మువ్వా శ్రీనివాసరావు, దాట్ల దేవదానం రాజు, మధునాపంతుల, నామాడి శ్రీధర్, బొల్లోజు బాబా తదితరులు హాజరవుతారు.