జాతీయ వార్తలు

హోలీ తరువాత మసీదు నిర్మాణంపై ట్రస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మార్చి 5: అయోధ్యలో మసీదు నిర్మాణంపై ట్రస్టు బోర్డును హోలీ తరువాత ప్రకటిస్తామని సున్నీ వక్ఫ్ బోర్డు గురువారం ఇక్కడ స్పష్టం చేసింది. వక్ఫ్ బోర్డు చైర్మన్ జుఫర్ ఫరూఖీ జమ్మూలో ఈ విషయాన్ని విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు. ‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అయోధ్యలో కేటాయించిన ఐదెకరాల భూమిలో మసీదు నిర్మాణంతో పాటు ఇండో-అమెరికన్ రీసెర్చ్ సెంటర్, ఆసుపఅతి, లైబ్రరీలను నిర్మించనున్నట్లు’ ఫరూఖీ పేర్కొన్నారు. ఈ నిర్మాణాలకు సంబంధించి ట్రస్టు బోర్డును హోలీ పర్వదినం తరువాత విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రకటిస్తామని వివరించారు.