జాతీయ వార్తలు

‘తార’ మంత్రంతో కరోనా వైరస్ మాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, జనవరి 28: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు టిబెట్ ఆధ్యాత్మిక గురు దలైలామా ఓ మంత్రం చెప్పారు. చైనాలో బయటపడిన కరోనా వైరస్‌కు 100 మంది వరకూ బలైపోయారు. కరోనా మహమ్మారి నుంచి ఎలా బయటపడాలని చైనా భక్తులు కొందరు బౌద్ధ గురువు దలైలామాను ఫేస్‌బుక్ ద్వారా అభ్యర్థించారు. వూహాన్‌లో బయటపడిన వైరస్‌తో జనంలో నెలకొన్న భయాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కాగా కరోనాను ‘తారా మంత్రం’ జపించడం ద్వారా ఎదుర్కోవచ్చని దలైలామా సెలవిచ్చారు. తన అనుచరులకు, బౌద్ధ సన్యాసులకు ఆయనీ సందర్భంగా సందేశం ఇచ్చారు. ‘ఓం తారే తుత్తరే తురే సోహా’అని జపించడం ద్వారా రోగాల బారి నుంచి విముక్తి పొందవచ్చని టిబెట్ గురు వెల్లడించారు. తార మంత్రం బ్రహ్మండంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. ‘మంత్రం జపించి మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. ఎలాంటి బాధలు ఉండవు’అని దలైలామా పేర్కొన్నారు. టిబెటన్ ఆధ్యాత్మిక గురువుస్వయంగా తన గొంతును ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. కరోనా వైరస్‌తో చైనాలో ఇప్పటి వరకూ 106 మంది మృత్యువాత పడ్డారు. గత ఇరవై నాలుగు గంటల్లో 1300 కొత్త కేసులు నమోదయ్యాయి. దగ్గు, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు వైరస్ లక్షణాలని వైద్య నిపుణలు చెబుతున్నారు.