జాతీయ వార్తలు

బీజేపీయేతర రాష్ట్రాల్లో అధికారమే పరమావధిగా కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: బీజేపీని ఉన్నత శిఖరాలకు తీసుకుపోయేందుకు కార్యకర్తలతో కలిసి అహర్నిశలు కృషి చేస్తానని పార్టీ కొత్త అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా ప్రకటించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడుగా సోమవారం మధ్యాహ్నం ఎన్నికైన అనంతరం తన గౌరవార్ధం కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ విజయం సాధించని రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా పని చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మాజీ అధ్యక్షుడు అమిత్ షా పార్టీకి చేసిన సేవలను కొనియాడుతూ అతని సారధ్యంలో పార్టీ ఎనె్నన్నో విజయాలను సాధించిందని నడ్డా ప్రశంసలు కురిపించారు. బీజేపీ ప్రపంచంలోని అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించడానికి ప్రధాన కారకుడు అమిత్ షా అని ఆయన చెప్పారు. ‘దేశంలో బీజేపీకి అత్యధిక మంది శాసనసభ్యులు, లోక్‌సభ సభ్యులు ఉన్నారు. మనం దీనికే పరిమితం కావడం లేదు. పార్టీ అధికారంలోకి రావలసిన రాష్ట్రాలు ఇంకా కొన్ని ఉన్నాయి’ అని నడ్డా చెప్పారు.
ఈ రాష్ట్రాల్లో విజయం సాధించేందుకు ప్రత్యేక కృషి చేస్తామన్నారు. ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే బీజేపీ ఎంతో భిన్నమైన పార్టీ, తమ ఫలితాలు కూడా భిన్నంగా ఉంటాయని నడ్డా తెలిపారు. తనను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఆయన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. తన లాంటి ఒక సామాన్య కార్యకర్త సీనియర్ నాయకులైన లాల్ కృష్ణ అద్వానీ, మురళీమనోహర్ జోషీలతో కలిసి పనిచేయడంతోపాటు పార్టీ అధ్యక్ష స్థానానికి ఎదిగానని, పార్టీ సిద్ధాంతాల మూలంగానే ఇది సాధ్యమైందని నడ్డా చెప్పారు.
'చిత్రం... కమల దళపతి నడ్డా