జాతీయ వార్తలు

కేంద్ర మంత్రి గెహ్లాట్‌తో తెలంగాణ మంత్రి కొప్పుల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 18: తెలంగాణలో సాంఘిక సంక్షేమ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్‌కు రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్‌తో తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణ భవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖలోని చిన్న గురుకులాల మాదిరిగా 66 మినీ గురుకులాల ఏర్పాటుకు రూ.303 కోట్లు మంజూరు చేయాలని కోరినట్టు చెప్పారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌ఫిప్‌ల కోసం రూ.356 కోట్లు, బీజేఆర్సీవై ప్రతిపాదించిన 7 హాస్టళ్లకు కోసం రూ.21 కోట్లు, సాంఘిక సంక్షేమ శాఖ సహాయం కింద రూ.201 కోట్లు అందించాలని కేంద్ర మంత్రిని కోరినట్టు ఆయన చెప్పారు. ఏడీఐపీ పథకం కింద దివ్యాంగులకు వీల్‌చైర్లు అందించేందుకు రూ.22కోట్ల సహాయం అందించాలని కోరామన్నారు. తమ విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిచారని, త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తానని గెహ్లాట్ వెల్లడించినట్టు ఈశ్వర్ వెల్లడించారు.