జాతీయ వార్తలు
అవయవ దానం అందరికీ స్ఫూర్తిదాయకం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 12 November 2019
న్యూఢిల్లీ, నవంబరు 12: మనిషి మరణాంతరం అవయవాలను దానం చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చునని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం ‘్ధధీయ దేవాదాన్ సమితి’ ఆధ్వర్యంలో అవయవ దానంపై జరిగిన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవయవ దానంపై జరిగిన ప్రేరణాత్మకమైన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. మన ప్రాణాన్ని ఇచ్చి మరో ప్రాణాన్ని కాపాడలేం.. కానీ మరణాంతరం అవయవాలను దానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు అన్నారు. అవయవ దానం మరణానతనం కూడా మనం బతికే ఉండొచ్చనే సందేశాన్ని ఇచ్చిందన్నారు.