జాతీయ వార్తలు

అభివృద్ధికే ఓటేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 16: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధికే ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక్కడికి సమీపంలోని పానె్వల్‌లో బుధవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ‘నరేంద్ర-దేవేంద్ర’ సూత్రం మహారాష్టల్రో బాగా పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధిపథంలో నడిపిస్తోందని అన్నారు. ఈ అభివృద్ధి ఇదే స్థాయిలో కొనసాగాలంటే మరోసారి తమకు అవకాశం ఇవ్వాలని మోదీ కోరారు. ‘నరేంద్రకు మరోసారి అవకాశం ఇచ్చిన విధంగానే దేవేంద్రకు కూడా రెండోసారి అవకాశం ఇవ్వండి. ఢిల్లీలో నరేంద్ర, ముంబయిలో దేవేంద్ర ఉండేలా ఆశీర్వదించండి. నిజానికి నరేంద్ర, దేవేంద్ర అనేది చాలా హిట్ ఫార్ములా. దీనిని కొనసాగించడానికి మేము కట్టుబడి ఉన్నాం. అవకాశం ఇవ్వండి’ అని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో పానె్వల్ ప్రాంత ప్రజలు బీజేపీని ఆదరించిన విషయాన్ని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని ఆయన కోరారు. ప్రజల భద్రత తమకు చాలా ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు.

*చిత్రం... ప్రధాని నరేంద్ర మోదీ