జాతీయ వార్తలు

అభిజిత్ ఇంటికి దీదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, అక్టోబర్ 16: నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ వినాయక్ బెనర్జీ ఇంటికి స్వయంగా వెళ్లిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన తల్లిని కలిశారు. ఆమె కుమారుడు నోబెల్ పురస్కారాన్ని సాధించడం పట్ల ఆమెను అభినందించారు.
సీనియర్ అధికారులతో కలసి అభిజిత్ ఇంటికి వెళ్లిన మమత, ఆయన తల్లి నిర్మలా బెనర్జీకి పుష్పగుచ్చాలు అందజేశారు. అభిజిత్ సాధించిన అఖండ ఘనతను చూసి పశ్చిమబెంగాల్ మాత్రమే కాకుండా యావత్ దేశం కూడా గర్వపడుతోందని సీఎం అన్నారు. తన భార్య ఈస్తర్ డఫ్లో, మైకేల్ క్రెమర్‌తో కలసి సంయుక్తంగా ఆర్థిక విభాగంలో అభిజిత్‌కు నోబెల్ పురస్కారం లభించిన విషయం తెలిసిందే.
నైహతిలో తృణమూల్ హవా
నైహతి మున్సిపాలిటీలో తృణమూల్ కాంగ్రెస్ అద్భుత విజయాన్ని సాధించింది. 31 స్థానాలు కలిగిన ఈ మున్సిపాలిటీలో 24 పరగణాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ మొత్తం స్థానాలను టీఎంసీ కైవసం చేసుకుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లో 42కు గాను టీఎంసీ 18 స్థానాలను చేజిక్కించుకుంది.